నారాదుడు చెప్పిన రామాయణం
-------------------------------------------------------------------------------------------------------------
రామాయణం రాయడానికి ముందు వాల్మీకి మహార్షి నారదుని
మధ్య జరిగిన సంభాషణ ఇది.
నారదుడు ఒకరోజు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఓ నారద మహార్షి..! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమంతుడు, ధర్మాత్ముడు, ఎదుటి వారి ఎడల ఆధణర భావము కలవాడు. గట్టి సంకల్పము, అనుకున్న పని నెరవేర్చే గుణము, యుద్ధ రంగంలో దిగితే దేవతలను కూడా జయించగలిగేవాడు. మానవుడు ఎవరైనా ఉన్నారా..? అని అడిగాడు...
ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి. ఆ వంశములో రాముడు అనే పేరు గల మహా పురుషుడు జన్మించాడు. అందరి చేత కీర్తించబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు. మహావీరుడు, మంచి ప్రకాశముగలవాడు అసాధారణమైన ధైర్యము అతని సొంతం.
అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు. నీతిమంతుడు. సకలశాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు.
రాముడు శత్రుభయంకరుడు. ఆజానుబాహుడు. అందగాడు. విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనస్సు చాలా గొప్పది. రాముడు అంత పొట్టికాదు, పొడుగూ కాదు. రాముడికి అన్ని అవయములు సమపాళ్లలో ఉన్నాయి. సకల ధర్మాలు తెలిసినవాడు. సత్యమునే పలికేవాడు. ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరతాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు.
---------------------------------------------------------------------------------------------------------
"రాముడు సముద్రం వలె గంభీరంగా ఉంటాడు. హిమాలయము వలే ధైర్యముగా నిలబడతాడు."
ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రిడిగా జన్మించాడు. పరాక్రమములో విష్ణువుతో సమానుడు. పున్నమి చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంతే ఆనందం రాముడిని చూస్తే కలుగుతుంది. కాని రాముడికి కోపం వచ్చిందా ప్రళయమే. ఓర్పులో భూదేవిని, ధానములో కుభేరుడిని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు.
అటువంటి రామునికి తండ్రి దశరధుడు. రాముడికి పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఈ విషయం దశరధుని భార్య కైకకు నచ్చలేదు. గతంలో దశరధుడు తనకు ఇచ్చిన వరములు ఇమ్మని కోరింది. ఆ రెండు వరములో ఒకటి రాముడిని రాజ్యము నుంచి వెళ్లగొట్టడం.
రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేయటం. మాట తప్పని దశరధుడు రాముడిని వనవాసమునకు వెళ్లమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావహించి, రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు పయనమయ్యాడు. తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముడిని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని రాముని వెంట వస్తానన్నాడు.
---------------------------------------------------------------------------------------------------------
భార్య సీత రాముడికి ప్రాణ సమానురాలు. ఆమె జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న నారీలోకములలో ఉత్తమురాలు. రాముడిని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు పయనమయింది. రాముడు, లక్ష్మణుడు, సీత అడవులకు వెళుతుంటే అయోద్య ప్రజలు గంగానది దాకా వచ్చారు. రాముని ఆదేశంతో అయోధ్యకు మరలివచ్చారు. రాముడు, సీత, లక్ష్మణుడు రాత్రికి శృంగిభేరపురములో గుహుడు అనే నిషాదుడిని కలుకున్నారు. రధమును వెనక్కి తీసుకుని వెళ్లమని తన సారధిని పంపివేశాడు. మరునాడు గంగానదిని దాటారు.
---------------------------------------------------------------------------------------------------------
ఒక వనము నుంచి మరోక వనమునకు పోతూ, భరద్వాజ మహార్షి ఆదేశము మేరకు చిత్రకూటము అనే ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక వర్ణశాలను నిర్మించుకున్నారు. ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నివశిస్తున్నారు. అయోద్యలో ఉన్న దశరధుడు పుత్రవియోగం తట్టుకోలేక స్వర్గస్థడయ్యాడు.
భరతుడిని రాజ్య పాలన చేయమని వశిష్టుడు మొదలగు వారు కోరారు. కాని భరతుడు ఒపుకోలేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్లాడు. రామునికి తండ్రి మరణ వార్త తెలిపి, తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాటించడం తన ధర్మమని, రాజ్యపాలనకు ఒప్పుకోలేదు. రాముడు తన పాదులకను భరతునికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు భరతునికి చెప్పి పంపివేశాడు. రామపాదుకలను భక్తితో తీసుకుని ఆయోద్య వెలుపల ఉన్న నందిగ్రామమునకు వెళ్లాడు. అక్కడ రాముని పాదులకు ఉంచాడు. రాముడు తిరిగి రావాలని కోరుకుంటూ అక్కడి నుంచే రాజ్యపాలన చేశాడు.
---------------------------------------------------------------------------------------------------------
తరువాత దండకారణ్యము ప్రవేశించాడు రాముడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుడిని చంపాడు. శరభంగ మహార్షిని, సుతీక్ష్య మహార్షిని, అగస్త్య మహార్షిని సందర్శించాడు. తరువాత కొందరు మునులు రాముడిని చూడటానికి వచ్చారు. రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని, వారిని సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముడిని వేడుకున్నారు. రాక్షస సంహారము చేస్తానని రాముడు వారికి మాట ఇచ్చాడు.
---------------------------------------------------------------------------------------------------------
ఆ దండకారాణ్యములోనే రావణుని సేనలూ ఉన్నాయి. రావణుని చెల్లెలు కూడా అక్కడే ఉంది. పేరు శూర్పణఖ. ఆమె కామరూపిణి. ఆమె రాముడిని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు. శూర్పణఖ వెళ్లి రావణుని సైన్యాధిపతులైన ఖర, దూషణ, త్రిశిరులకు జరిగిన అవమానం గురించి చెప్పింది.. వారందరూ రాముని మీదకి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధము చేసి 14వేల మంది రాక్షసులను సంహరించాడు.
---------------------------------------------------------------------------------------------------------
ఈ వార్త విన్న రావణుడికి కోపం వచ్చింది. తనకు సాయం చెయ్యమని మరీచుడు అనే రాక్షసుడిని కోరాడు. మరీచుడు ఒప్పుకోలేదు. ఖర, దూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహా వీరునితో వైరము పెట్టుకోవద్దని చెప్పాడు. కాని రావణుడు వినలేదు. మరీచుడిని బలవంతంగా ఒప్పించాడు. మరీచుడిని వెంటబెట్టుకుని రావణుడు రాముడు ఉండే ఆశ్రమానికి వెళ్లాడు. మరీచుని సాయముతో రాముడిని, లక్ష్మణుడిని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపాడు.
---------------------------------------------------------------------------------------------------------
రామ లక్ష్మణులు ఆశ్రమానికి తిరిగివచ్చారు. సీత కనిపించలేదు. సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించింది. రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. జటాయువునకు దహన సంస్కారాలు చేశారు. ఆ తరువాత సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుడిని చూశారు. తమకు అపకారము చేయబోయిన కబంధుడిని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్లమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు.
---------------------------------------------------------------------------------------------------------
శబరి ఆశ్రమానికి వెళ్లారు. శబరి వారిని పూజించింది. అక్కడి నుంచి పంపా తీరమునకు వెళ్లారు. హనుమంతుడిని చూశారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహము చేశారు. రాముడు తన గురించి సీతాపహరణము గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడేమే.. తనకు తన తన్న వాలికి ఉన్న వైరము గురించి రాముడికి చెప్పాడు. వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు రాముడు. కాని రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానము కలిగింది. అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలి గోటితో పది యోజనములు దూరంగా పడేటట్లు విసిరివేశాడు. ఒకే బాణంతో ఏడు మర్రిచెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముడి మీద నమ్మకం కలిగింది.
---------------------------------------------------------------------------------------------------------
రాముడిని వెంట తీసుకుని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్లారు. సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు. వాలి భార్య 'తార' వాలిని యుద్ధమునకు వెళ్లవద్దని వారించింది. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుడిని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుడిని చేశాడు.
---------------------------------------------------------------------------------------------------------
తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెతుకమని వానరులను నలుదిక్కులకూ పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోక వనంలో దుక్కిస్తున్న సీతను చూశాడు. హనుమంతుడు సీత వద్దకు వెళ్లాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ, సుగ్రీవుల మైత్రీ గురించి చెప్పాడు. తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వసం చేశాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేవాపతులను ఐదుగురిని చంపాడు. అక్షకుమారుని చంపాడు. చివరికి బంధించబడ్డాడు. తరువాత తనని తాను విచిపించుకుని లంకాధహనము చేశాడు.
---------------------------------------------------------------------------------------------------------
హనుమంతుడు లంక నుంచి రాముడి వద్దకు వచ్చాడు. "అమ్మను చూశాను". అని రామునితో చెప్పాడు. తరువాత వానర సేనతో సముద్ర తీరము చేరుకున్నారు. తనకు దారి ఇవ్వని సముద్రుడిని రామ బాణంతో అల్లకల్లోలం చేశాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు 'నీలుని'తో వారధి కట్టించాడు. ఆ సేతువు మీదుగా లంకకు చేరుకున్నారు. రావణునితో యుద్ధము చేసి సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు.
---------------------------------------------------------------------------------------------------------
ఆ మాటలు భరించలేక సీత అగ్ని ప్రవేశము చేసింది. అగ్నిదేవుడు వచ్చి 'సీత కల్మషము లేనిది' అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు. రావణ సంహారం చేసినందుకు రాముడిని సమస్త దేవతలు, ఋుషులూ ఎంతగానో శ్లాఘించినారు రాముడు విభీషణుడిని లంకారాజ్యమునకు రాజును చేశాడు. రాముడిని చూడటానికి వచ్చిన దేవతలు అనేక వరాలు ఇచ్చారు. ఆ వరాలతో యుద్ధములో చనిపోయిన వానరులందరినీ బతికించారు. అందరూ పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు వెళ్లారు.
---------------------------------------------------------------------------------------------------------
రాముడు ముందు భరధ్వాజ ఆశ్రమానికి వెళ్లాడు. హనుమంతుడిని నంది గ్రామములో ఉన్న భరతుని వద్దకు పంపాడు. తరువాత రాముడూ నందిగ్రామమునకు వెళ్లాడు. తన సోదరులను కలుసుకున్నాడు. ముని వేషధారణను వదిలి రాముడు, సీత, లక్ష్మణుడు క్షత్రియ రూపానికి మారారు. రాముడు అయోద్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకమునకు లోకాలన్నీ సంతోషించాయి.
---------------------------------------------------------------------------------------------------------
రామడి పాలననలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిశాయి. దుర్భిక్షము లేదు. తండ్రీ జివించి ఉండగా పుత్రులు మరణించడం అనేది లేదు. స్త్రీలందరరూ పతివ్రతలుగా ఉన్నారు. రామ రాజ్యంలో అగ్ని, జల, ఆకలి భయం గాని లేవు. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషముగా జీవించారు.
---------------------------------------------------------------------------------------------------------
రాముడు లెక్కలేనన్ని ఆశ్వమేధ యాగములు చేశాడు. లక్షల కొలది గోవులను బ్రాహ్మాణులకు దానంగా ఇచ్చాడు. రామ రాజ్యములో "నాలుగు వర్ణములవారు" తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషముగా జీవించారు. ఆ ప్రకారముగా "రాముడు 11,000 సంవత్సరాలు" రాజ్య పాలన చేసి తుదకు బ్రహ్మా లోకానికి చేరుకున్నాడు.
#varahitalks
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి