25, సెప్టెంబర్ 2021, శనివారం

virudhachalam temple history in telugu

 వృద్దగిరీశ్వర ఆలయం.... వృద్ధాచలం..

-----------------------------------------------------------------------------

కాశీ.. ఈ పేరు చెప్పగానే పవిత్రమైన భక్తి భావం పొంగుతుంది. గంగలో మునిగితే చాలు.. సకల పాపాలు తొలగి, ముక్తి లభిస్తుంది. ప్రతి హిందూవు తన జీవితంలో ఒక్క సారైన చూడాలి అనుకునే గొప్ప ఆలయాల్లో కాశీ ఒకటి.

అయితే ఈ వీడియోలో కాశీ కంటే గొప్ప ఆలయం, శివుడు నడయాడిన స్థలం, వియుకుడే వచ్చి దర్శనం ఇచ్చిన ఆలయం.. అంతేనా ఇంకా ఎన్నో అద్భుతాలు, శివుని మహిమలు కలిగిన గొప్ప ఆలయం గురించి మీకు చెప్పబోతున్నాను.


ఎక్కడ ఉంది :

తమిళనాడు ప్రాంతంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. అందులో చరిత్ర కలిగిన ఆలయం వృధ్ధకాశీ. దీనినే వృద్ధాచలం అని కూడా అంటారు. శైవులకి ముఖ్యమైన క్షేత్రాలు 108. వాటిలో 4 క్షేత్రాలు అతి ముఖ్యమైనవి. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా లో వృద్ధాచలం అతి పురాతనమైన క్షేత్రం. భూకంపాలు, వరదలు, యుద్దాలు వచ్చినా కూడా చెక్కు చెదరని ఆలయం. ఇక్కడ స్వామిని సేవించినవారికి కాశీలో విశ్వనాధుని సేవించినదానికన్నా కొంచెం ఎక్కువే పుణ్యం వస్తుంది. సాక్ష్యాత్తు పరమ శివుడే ఇక్కడ ఆనంద నాట్యం చేశాడని చరిత్ర చెబుతుంది. ఇక్కడ వుట్టినా, గిట్టినా, నివసించినా, భగవంతుణ్ణి ప్రార్ధించిన ఈ స్వామిని తలచినా మోక్షం లభిస్తోంది.

-----------------------------------------------------------------------------------------------------------------------

స్థల పురాణం :

శివుడు ప్రధమంగా ఇక్కడ కొండ రూపంలో వెలిశాడు. అందుకే ఈ క్షేత్రం పేరు పఝమలై అని తమిళంలో వచ్చిన తర్వాత సంస్కృతంలో వృద్ధాచలం అయింది. పూర్వం ఒకసారి ఈ ఊరి ప్రజలు కరువు కాటకాలతో, చాలా ఇబ్బందులలో వుంటే, స్వామివారు కనిపించి నాకు సేవ చేయండి చేసినవారికి చేసినంత లభిస్తుందని చెప్పాడట. అప్పుడు 'విభాసిత మహర్షి' మణిముత్తా నదిలో స్నానం చేసి, ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాడు. పని చేసిన వారికి ధనమునకు బదులు వన్నిచెట్టు ఆకులు కూలీకింద ఇచ్చేవాడుట. ఆ మనిషి చేసిన పని, దాని నాణ్యతకు తగినట్లుగా ఆ ఆకులు నాణాలుగా మారేవట. అప్పటి నుంచే 'చేసినవారికి చేసినంత, చేసుకున్నవారికి చేసుకున్నంత' అనే నానుడులు వచ్చాయంటారు పెద్దలు. ఈ వృక్షం వయస్సు 1,700 సంవత్సరాల క్రితందని పరిశోధకులు తేల్చేరు !! 

-----------------------------------------------------------------------------------------------------------------------

పాట పాడించుకున్న శివుడు : 

సుందరార్ అనే గాయకుడు ఉండేవాడు. పేదవాడు. కుటుంబ అవసరాల కోసం పాటలు పాడి డబ్బులు సంపాదించుకునేవాడు. ఒకరోజు అతను తిరువారూర్కి బయల్దేరాడు. ఈ క్షేత్రం నుంచి వెళ్తూ స్వామిని స్తుతించకుండా వెళుతున్నాడు. ఆయనని ఆపి, పాడించుకున్నాడు శివుడు. బహుమతిగా 12,000 బంగారు నాణాలు ఇచ్చాడట. 

-----------------------------------------------------------------------------------------------------------------------

ఆయన వెళ్లే దారిలో దొంగల భయం ఎక్కువగా వుండటంవల్ల నష్టపోతాడేమోనని ఆ నాణాలను మణి ముత్తానదిలో వేసి "తిరువారూర్ వెళ్లి అక్కడ ఆలయంలో వున్న కొలనులోంచి" తీసుకొమ్మని చెప్పాడట. ఆయన అలాగే తీసుకున్నాడు. ఇవి స్వామి ఇచ్చిన నాణేలేనా కాదా అనే ఆలోచన అతనికి వచ్చిందంటా... అప్పుడు సాక్ష్యాత్తు వినాయకుడే వచ్చి ఇవి నా తండ్రి ఇచ్చిన నాణేలే అని చెప్పాడంటా.. అరుణాచలం (తిరువణ్ణామలై)లో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి భక్తులు ఇక్కడా గిరి ప్రదక్షిణ చేస్తారు.

-----------------------------------------------------------------------------------------------------------------------

సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ప్రత్యేకత :

ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి వున్నాడు. ఆలయం పైన శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. ఇక్కడి ప్రత్యేకతలు. అందుకే ఇక్కడి స్వామికి విన్నవించుకుంటే కోరికలు త్వరగా తీరుతాయట. శైవ సిద్ధాంత ప్రకారం 28 ఆగమ శాఖలు వున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివ లింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడు. ఆ సిద్ధాంతాల పేర్లతోనే శివుని పేర్లు కూడా కామికేశ్వరుడు, యోగేశ్వరుడు మొదలగు పేర్లు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ విశేషం వల్ల ఈ ఆలయానికి "ఆగమ ఆలయ"మనే పేరుకూడా వచ్చింది.

-----------------------------------------------------------------------------------------------------------------------

విఘ్నేశ్వర ఆలయం ప్రత్యేకత :

ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఎడమవైపు కనిపించే ఉపాలయంలో విఘ్నేశ్వరుడు కొలువు దీరి వుంటాడు. శ్రీ కాళహస్తిలో ఉన్నట్లుగానే  విఘ్నేశ్వరుడు భూతలం నుంచి కిందకి వున్న ఆలయంలో వుంటాడు. దర్శించటానికి 18 మెట్లు దిగి వెళ్ళాలి. ఇక్కడి అమ్మవారి పేరు వృద్ధాంబిక. 


అమ్మవారి కథ :

పూర్వం నమశ్శివాయార్ అనే భక్తుడు చిదంబరం వెళ్తూ ఒక రాత్రి ఇక్కడ బస చేశాడు. ఆయనకి బాగా ఆకలయింది. పరమేశ్వరిని ఆకలి తీర్చమంటూ చేసిన స్తుతిలో అమ్మని పొరపాటున "కిజతి" అన్నాడు. అంటే పెద్దావిడ, ముసలావిడ అనే పదం వాడాడు. ఆ తల్లి వృద్ధురాలి వేషంలో వచ్చింది. నమశ్శివాయార్ కిజతి ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే తినడానికి పెట్టండి అన్నాడు. ముసలివాళ్ళు భోజనం పెట్టలేరు నయనా.. చిన్నవాళ్ళే పెట్టగలరని చెప్పిందట. అప్పుడు ఆ భక్తుడు అమ్మవారిని యువతిగా వర్ణిస్తూ పాడేసరికి అమ్మ ఒక యువతిగా వచ్చి ఆయనకి భోజనం పెట్టిందట. అప్పటినుంచి అమ్మని 'బాలాంబిక'గా పిలుస్తారు. 

-----------------------------------------------------------------------------------------------------------------------

భక్తుల నమ్మకం : 

ఇక్కడ శివుడు స్వయంభువుడు. శివుణ్ణి ప్రార్ధించినవారికి మనశ్శాంతి కలగటమేకాక అన్ని రకాల శరీర రుగ్మతలనుండి వెంటనే విముక్తి కలుగుతుంది. ఇక్కడ వున్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, పిల్లలు పుట్టటం, వంటి కోరికలు నెరవేరటమేకాక, జీవితంలో అభివృద్ధిక ఆటంకాలు కూడా తొలుగుతాయి. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణి ముత్తానదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్ళుగా మారి నది అడుగు భాగంలో నిలిచి వుంటాయట.

-----------------------------------------------------------------------------------------------------------------------

భైరవ పూజ : 

ఆదివారం, రాహుకాల సమయంలో అంటే 4-30 నుంచి 6 గం.ల దాకా.. భక్తులు ఇక్కడ భైరవుడికి వడమాల వేసి పూజలు చేస్తారు. దీనివలన కష్టాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఆదిదేవుట్టి ఇక్కడ కొలిచినవారికి ఈ జన్మలో సుఖంగా వుండటమేగాక, వచ్చే జన్మలో కూడా మంచి జీవితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

-----------------------------------------------------------------------------------------------------------------------

ఐదవ నంబర్ ఈ ఆలయంలో ప్రత్యేకం

  • 5 నంబరు ఈ ఆలయ చరిత్రలో భాగం, ఆలయ ప్రాంగణంలో పూజలందుకునే మూర్తులు ఐదుగురు. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. 
  • ఇక్కడ ప్రధాన దేవుడు శివుడు స్వామికి 5 పేర్లున్నాయి విరుధగిరీశ్వరుడు, వఝుమలైనా థార్, విరుధ్ధాచలేశ్వర్, ముద్దుకుంద్రీశ్వరుడు, వృద్ధ గిరీశ్వరుడు. 
  • ఇక్కడ 5 వినాయక విగ్రహాలున్నాంటాయి. ఐదుగురు ఋషులు స్వామి దర్శనం చేశారు. వారు రోమేశుడు, విబాళిద్దు, కుమారదేవుడు, నాదశర్మ మరియు అనవర్దిని.
  • ఆలయానికి 5 గోపురాలు, 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు వున్నాయి. 
  • వేకువఝామునుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయాల్లో 5సార్లు పూజలు చేస్తారు. 
  • ఆలయాని కి 5 రథాలున్నాయి. వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వరవ్వామికి, వఝుములైనాధార్కి, పెరియనాయకికి (శివుడు, పార్వతి), వీరభద్రుడికి, 5 పేర్లున్నాయి. తిరుముద్దుకుండ్రం, వృద్ధకాశి, వృద్ధాచలం, నెర్ కుప్పాయ్, ముద్దుగిరి. 
  • పరమశివుడు నాట్యానికి ప్రసిద్ధి. చిదంబరంలో కాళితో పోటీపడి నృత్యం చేస్తే, ఇక్కడ వృద్ధాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడట. ఆనంద రూపంలో ఉండే శివుడిని ప్రార్ధిస్తే వెంటనే ఫలితం వస్తుందని భక్తుల భావన.

-----------------------------------------------------------------------------------------------------------------------

మోక్షాన్ని ప్రసాదించే శివుడు : 

వృద్ధాచలాన్ని వృధ్ధ కాశి అని కూడా అంటారు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది అంటారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృధ్ధకాశీ అని చెప్పబడే ఈ వృద్ధాచలంలో మరణించిన వారికి అంతకన్నా కొంచెం ఎక్కువ పుణ్యమే వస్తుందిట. కాశీలో చెప్పబడ్డట్లుగానే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సు తన ఒడిలో వుంచుకుని అమ్మ వృద్ధాంబిక తన చీరె కొంగుతో వినురుతూండగా, వారి చెవిలో వరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి, వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

#varahitalks

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...