12, సెప్టెంబర్ 2021, ఆదివారం

When and how did Dwapar yuga ended?

ద్వాపర యుగం చివరిలో జరిగింది ఏమిటి

-----------------------------------------------------------------------------------------------------

 క్రిష్ణుని నిర్యాణం..

-----------------------

ద్వాపర యుగం అంతం

-------------------------------

ద్వారక నీటిలో మునక


కురుక్షేత్ర యుద్ధం తరువాత జరిగిన సంఘటనలు ఏమిటి..? క్రిష్ణుడు, బలరాముడు, రుక్మీణీ, సత్యభామ మొదలగు వారు ఏమయ్యారు. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు విజయం సాధించడంతో ధర్మరాజు హస్తినాపురానికి రాజు అయ్యాడు. సుమారు 36 సంవత్సరాల పాటు అతను రాజ్య పాలన చేశాడు. ఆ తరువాతే యాదవ రాజ్యం నాశనం కావడం క్రమంగా ప్రారంభమైంది. యాదవ రాజ్యం అంతం కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. తన నూరుగురు కుమారులు యుద్ధంలో మరణించడంతో ఎంతో బాధపడిన గాంధారి క్రిష్ణుడికి శాపం ఇచ్చింది. ఆమె శాపం ఫలించడానికి సుమారు 36 సంవత్సరాలు పట్టింది.


ఇక రెండవ కారణం.. ఒక రోజు శ్రీ క్రిష్ణుడిని చూడాలని కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు మరియు వారి శిష్య బ్రుందము ద్వారకకు వచ్చారు. ఆ సమయంలో కొందరు యాదవ యువకులు క్రిష్ణుని కుమారుడికి ఆడపిల్ల వేషం వేసి మునుల వద్దకు తీసుకుపోతారు. ఓ మునులారా ఈమెకు పెళ్లి అయ్యి చాలా కాలం అయింది కానీ సంతానం మాత్రం లేదు. మీరు మునులు కదా దయచేసి చెప్పండి. ఈమెకు సంతానం కలుగుతుందా.. అని అడుగుతారు. ఇది ఆకతాయిల పని అని తెలుసుకున్న ఆ మునులు.. ఓ తప్పకుండా సంతానం కలుగుతుంది. కాకపోతే ఓ ముసలాన్ని (ముసలం అంటే రోకలి లేదా నాశనకారి అని అర్థం) కంటుంది అని చెబుతారు. మునులు చెప్పిన విధంగానే ఆమె అంటే.. క్రిష్ణుని కుమారుడు అయిన సాంబుడు ముసలాన్ని కంటాడు. 

----------------------------------------------------------------------------------------------------------------

దానిని ప్రజలు చూస్తే ఎక్కడ తమ పరువు పోతుందేమో అని.. వసుదేవుడు రాత్రికి రాత్రే ఆ ముసలాన్ని పొడిగా చేసి సముద్రంలో కలిపివేస్తాడు. కొన్ని రోజుల తరువాత ఈ రెండు శాపాల ఫలితంగా ఏదో ఒక ఉపద్రవం ద్వారకలో జరుగుతూనే ఉంది. ఎన్నో అశుభాలు వారికి కనిపిస్తున్నాయి. ఇలాంటి ఉపద్రవాలు మళ్లీ ..మళ్లీ జరుగుతుండటంతో గాంధారి, రుషుల శాపాలు ఫలిస్తున్నాయని, యాదవ కుల నాశనం ఇక తప్పదని శ్రీక్రిష్ణుడు గ్రహిస్తాడు. ఎలాగూ నాశనం తప్పదు. ఆ జరిగే నాశనం ఏదో.. పుణ్యక్షేత్రము, సముద్రతీరము అయి అక్కడే ఈ నాశనం జరిగితే మంచిదని నిర్ణయిస్తాడు. అందరినీ అక్కడికి చేర్చాలి. మాములుగా రమ్మంటే రారు కదా.. 

----------------------------------------------------------------------------------------------------------------

అందుకే ఒక జాతరను ఏర్పాటు చేస్తాడు. అందరినీ జాతర పేరుతో అక్కడికి తీసుకుపోయాడు క్రిష్ణుడు. మరోవైపు యాదవులంతా మధ్యానికి బానిసలు అయ్యారు. సాత్యకి, క్రుతవర్మ తగువులాడుకోవడం ప్రారంభించారు. సముద్రంలో ఉన్న తుంగపరకలేమో శాపబలంతో ఆయుధాలుగా మారాయి. వాటితోనే వారిలో వారే అంతఃకలహాలతో ఒకరినొకరు పొడుచుకుంటూ చనిపోతున్నారు.

----------------------------------------------------------------------------------------------------------------

ఇదంతా జరడానికి ముందే బలరాముడు తపస్సు చేసుకుందామని అరణ్యాలకు వెళ్లిపోతాడు. తన కళ్లముందే యాదవ వీరులంతా.. ఒకరినొకరు నరుక్కుని నాశనం అవుతుంటే క్రిష్ణుడు ఎంతో బాధపడతాడు. ఇదంతా చూడలేక దారుకునితో ఇలా చెబుతాడు. యాదవ వర్గం నాశనం కాబోతుంది. నీవు వెళ్లి అర్జునుడిని ద్వారకకు తీసుకురా.. అని చెప్పి పంపిస్తాడు. అతను ద్వారక నుంచి బయలుదేరతాడు. తరువాత బభ్రుడనే మరొక యాదవుడూ.. 

----------------------------------------------------------------------------------------------------------------

అక్కడే వుండగా అతడికి స్త్రీలను, గుర్రాలను, ఏనుగులను అన్నింటినీ ద్వారకకు చేర్చు అని చెబుతాడు. క్రుష్ణుడు చెప్పినట్లు వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఇంతలో క్రిష్ణుడు చూస్తుండగానే ఓ బోయవాడు పిచ్చిపట్టినట్లు ఎగురుతూ వచ్చి బభ్రుడి మీదకు తుంగపరక విసురుతాడు. బభ్రుడు మరణిస్తాడు. ఇక చేసేది ఏమీ లేక అప్పగించిన పనికి తానే పూనుకుని స్త్రీలను, రథాలను, గుర్రాలను, ఏనుగులను ద్వారకకు చేర్చుతాడు. అక్కడి నుంచి వసుదేవుడి వద్దకు వెళతాడు.. అతనికి జరిగింది. జరగబోయేది అంతా వివరంతా చెబుతాడు. ఇదంతా విన్న వసుదేవుడు ఇంత దారుణం జరుగుతుందా.. అని సొమ్మసిల్లి పడిపోతాడు. అతడిని లేపి సపర్యలు చేస్తాడు క్రిష్ణుడు. ఆ తరువాత నేను కూడా అన్న బలరాముడి వద్దకు వెళ్లి తపస్సు చేసుకుంటాను. 

----------------------------------------------------------------------------------------------------------------

ఇక్కడ ఉండలేను అని చెప్పి, ఇక మీరే అంతా చూసుకోవాలి. మీతో పాటు అర్జునుడు కూడా ఉంటాడు. మీ దుఖాలన్నింటినీ అర్జునుడు పోగొడతాడు. తరువాతి కార్యాలను కూడా అతనే చూసుకుంటాడు. మీరు దిగులు పడకండి అని చెప్పి బలరాముడిని వెతుక్కుంటూ క్రిష్ణుడు వెళతాడు. తరువాత కొంత సమయానికి అరణ్యంలో వెతకగా బలరాముడు కనిపిస్తాడు. అతని వద్దకు వెళ్లగానే ఒక మహా సర్పం బలరాముని ముఖం నుంచి వేయి నోళ్లతో.. ఎర్రని కన్నులతో వచ్చి అధ్రుశ్యం అవుతుంది. దానితో పాటే బలరాముడు కూడా కనిపించడు. 

----------------------------------------------------------------------------------------------------------------

ఆ చోటును వదిలి అరణ్యంలో డా తిరుగుతాడు క్రిష్ణుడు. నా దేహ త్యాగానికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తాడు. అక్కడక్కడా క్రిష్ణుడికి గతంలో దుర్వాసుడు ఇచ్చిన శాపం గుర్తుకు వస్తోంది. ఆ శాపం ఏమిటిటంటే అరికాలి నుంచే క్రిష్ణుని ప్రాణం పోతుంది. కొంత సమయం అటు ఇటు తిరుగుతాడు క్రిష్ణుడు. బాగా అలసిపోయి ఓ చోట నిద్రిస్తాడు. క్రిష్ణుని మరణానికి కారణమైన ఓ జింక అడవిలో అటూ ఇటూ తిరుగుతుంది. దానిని చూసిన ఓ వేటగాడు బాణంతో బలంగా కొడతాడు. ఇంతలో అది అద్రుశ్యం అవుతుంది. ఆ బాణం వచ్చి క్రిష్ణుని అరికాలిలో గుచ్చుకుంటుంది. 

----------------------------------------------------------------------------------------------------------------

ఇదంతా గమనించిన వేటగాడు క్రిష్ణుని వద్దకు వచ్చి స్వామి నన్ను క్షమించండి.. నేను కావాలని బాణం వేయలేదు అని వేడుకుంటాడు. క్రిష్ణుడు ఆ వేటగాడిని ఓదార్చి దిగులు చెందకు అని అతడిని సముదాయించి, తన దేహాన్ని విడిచి... తన స్వస్థానానికి వెళతాడు.


యాదవకుల నాశనం, జరిగిన సంఘటనలు దారుకుని ద్వారా పాండవులు తెలుసుకుంటారు. ద్రౌపది, శుభధ్ర మొదలగు వారు ఎంతో దుఖిఃస్తారు. అర్జునుడు క్రిష్ణుడు చెప్పిన విధంగా బయలుదేరి ద్వారకా నగరానికి చేరుకుంటాడు. బలరాముడు, క్రిష్ణుడు లేరని తెలుసుకుని ఎంతో బాధపడతాడు. అర్జునుడు వచ్చిన విషయం.. తెలుసుకున్న రుక్మిణీ, సత్యభామ, క్రిష్ణుని ఇతర భార్యలూ కూడా అర్జునుడిని చూసి భోరున విలపిస్తారు. వారందరినీ ఓదార్చుతాడు. అక్కడి నుంచి అర్జునుడు వసుదేవుని వద్దకు వెళతాడు.

----------------------------------------------------------------------------------------------------------------

అర్జునా.. క్రిష్ణుడు నాతో ఇలా అన్నాడు. అర్జుణుడు వస్తాడు. మీ అందరినీ రక్షిస్తాడు. కొన్ని గంటల్లో ద్వారక కూడా నీట మునగబోతుంది. మరణించిన వారందరికీ పిత్రుకార్యాలు అర్జునుడు చేస్తాడు అని క్రిష్ణుడు చెప్పిన మాటలు అతనికి చెప్పి వసుదేవుడు కూడా యోగ నిష్టతో తన దేహాన్ని వదిలిపోతాడు. మరణించిన వసుదేవునికీ, ఇతర వీరులకు అర్జునుడు అగ్ని సంస్కారాలు చేశాడు. 



మిగలిన యాదవ జనులందరినీ ఇంద్రప్రస్థానానికి తరలించడానికి తగిన సూచనలు, సన్నాహాలు చేశాడు. మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి.. అని చెప్పి బలరాముడు, క్రిష్ణుడిని వెతికేందుకు.. అర్జునుడు మరికొంత మంది ఆప్తులు బయలుదేరారు. అరణ్యంలో ఎంత వెతికినా ఎక్కడా వారి జాడ కనిపించలేదు. ఇక చేసేది ఏమీ లేక ఒక చెట్టుకింద కూర్చుని ఆలోచిస్తున్నారు. ఇంతలో అక్కడికి వేటగాడు వస్తాడు. ఓ దొరా.. ఎవరు మీరు.. ఎందుకు ఇక్కడ ఉన్నారు. 

----------------------------------------------------------------------------------------------------------------

సంగతి ఏమిటీ అని అడగగా జరిగిన విషయం అతనికి చెప్పాడు అర్జునుడు. ఓ నేను చూపిస్తాను. రండి దొరా.. అని అక్కడికి తీసుకుపోతున్నాడు. ఇదిగో సామి అక్కడ చెట్టు ఉంది కదా.. అక్కడే ఆ దేవుడు వున్నాడు.. పోయి చూడండి అని వేటగాడు వెళ్లిపోతాడు. అర్జునుడు పరుగున అక్కడికి చేరుతుంటే ఆ చెట్టు వేయికాంతులతో వెలిగిపోతూ కనిపించింది.. ఆ వెలుగుల్లో అక్కడే నేలపై క్రిష్ణుని శరీరం దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతూ వారికి కనిపించింది. క్రిష్ణుడిని చూసి భోరున విలపిస్తాడు. అతని రోధన వర్ణించడానికి వీలులేని విధంగా ఉంది. తెల్లవారితే ద్వారక మునిగిపోతుంది అన్న విషయం అతనికి గుర్తుకు వచ్చింది. క్రిష్ణుని నిర్యాణ వార్త చెబితే స్వర్గానికి వారు బయలుదేరరు. కాబట్టి వారికి చెప్పకుండా ఉండటమే మంచిది అనుకుంటాడు. 

----------------------------------------------------------------------------------------------------------------

తనతో పాటు వచ్చిన వారికి కూడా క్రిష్ణుని నిర్యాణ వార్త ఎవరికీ చెప్పకండి. జరగవలసిన కార్యం జరగదు అని వారికి చెబుతాడు. క్రిష్ణుని శరీరానికి సంస్కారాలు చేసి రాత్రికి రాత్రే ద్వారకకు వెళ్లి అక్కడ ఉన్న వారందరినీ బయలుదేర దీశాడు. వారంత తెల్లవారేలోపునే బయలు దేరగలిగారు. కానీ బయలు దేరి కొద్ది దూరం వెళ్తూండగానే సూర్యోదయం కావచ్చింది. ఇంతలో ద్వారక వారి కళ్ల ముందే మునిగిపోయింది. అర్జునుడు బయలు దేరదీసిన పరివారంలో సత్యభామా, రుక్మీణీ కూడా ఉన్నారు. కాని వారి ప్రాణనాధుడైన శ్రీ క్రిష్ణుడు మరణించినట్లు వారికి తెలియదు. స్త్రీలతో పాటు వజ్రుడు, మొదలైన పురుషులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

----------------------------------------------------------------------------------------------------------------

కొంత దూరం వెళ్లి.. పంచవటమనే చోట దారిలో కాసేపు ఆగారు. అర్జునుడు తప్పించి వేరే యేధులు ఎవరూ ఆ సమూహంలో లేరు. స్త్రీలు బాలలు, వ్రుద్ధులు మాత్రమే ఉన్నారు. వారి వద్ద భారీగా బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఒక దొంగల గుంపు వారిని చూసింది. స్త్రీల మీద పడి నగలు ఒలుచుకుంటూ ఉండగా.. అర్జునుడు ముందు హెచ్చరించాడు. వారు వినకపోయే సరికి గాంఢీవం ఎక్కు పెట్టి కిరాతకుల మీదకు బాణాలు సంధిస్తాడు. ఒక్క బాణం కూడా ఆ దొంగల గుంపును ఏమీ చేయలేక పోయింది. తేలికపాటి బాణాలు, కర్రలు, రాళ్లను పెట్టి మహా యోధుడైన గాంధీవిపై దాడి చేశారు. మహా అస్త్ర సంపన్నుడైన అర్జునుడికి విచిత్రంగా అనిపించింది. ఒక్క అస్త్రానికి సంబంధించిన మంత్రమూ, బాణములు పని చేయలేదు. అర్జునుడు ఎన్ని బాణాలు ప్రయోగించినా అతని అమ్ములపొదిలో భాణాలు తరిగిపోవు. కానీ అప్పుడు మాత్రం బాణాలు కాసేపటికే నిండుకున్నాయి.

----------------------------------------------------------------------------------------------------------------

అర్జునుడికి అర్ధం అయింది. దైవబలం లేదని తెలుసుకుని తన గాండీవాన్ని తిప్పి కిరాతకులను కొడుతూ రుక్మీణీ, సత్యభామ, బలరాముడి భార్యలను, కొందరు యాదవస్త్రీలను కాపాడగలిగాడు. తక్కిన స్త్రీలను కిరాతకులు బంధించారు. ధనాన్ని కొల్లగొట్టారు. చేయగలిగిన నాశనం చేసి వెళ్లిపోయారు. ఈ దాడి తరువాత మిగిలిన జనాన్ని తీసుకుని అర్జునుడు కురుక్షేత్రానికి వెళ్లాడు. అక్కడ ఆప్తులందరికీ జరిగింది చెప్పాడు. ఆపైన తన రాజ్యంలో వివిధ నగరాలను మిగిలిన యాదవ కుమారులకు పంచిపెట్టి, ఒక్కో కుటుంబపు బాధ్యత ఒక్కొక్కనికి అప్పగించి వారి పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు.

----------------------------------------------------------------------------------------------------------------

చివరికి ఒక రోజు బలరామ క్రిష్ణుల నిర్యాణం గురించి, ఏ కారణంగా అప్పుడు .. ఈ సంగతి చెప్పలేదన్న విషయం గురించి.. వారి భార్యలకు చెప్పాడు. ఇంతకాలమూ చెప్పనందుకు తనకు పాపం చుట్టుకుందని బాధపడగా ఆ యాదవకాంతలు అర్జునుడిని ఓదార్చారు. రుక్మీణీ, జాంబవతి, తదితర స్త్రీలు సహగమనం చేశారు. సత్యభామ, మరి కొందరూ తీవ్రమైన తపస్సు చేయడానికి అడవుతలకు వెళ్లిపోయారు. ఈ రకంగా ద్వాపర యుగం ముగిసింది.

#varahitalks

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...