12, నవంబర్ 2021, శుక్రవారం

శివపార్వతుల కల్యాణం

శివపార్వతుల కల్యాణం

కైలాస పర్వతానికి కొత్త కళ వచ్చింది. ఆదిదేవుడు కొత్త పెళ్ళికొడుకు అయ్యాడు.. పార్వతీ దేవి సిగ్గుల మొగ్గలు ధరించి కొత్త పెళ్లి కూతురుగా శంకరుని కోసం ఎదురు చూస్తుంది. దేవి గణాలు , శివపార్వతుల కల్యాణం

‌కైలాస పర్వతానికి కొత్త కళ వచ్చింది. ఆదిదేవుడు కొత్త పెళ్ళికొడుకు అయ్యాడు.. పార్వతీ దేవి సిగ్గుల మొగ్గలు ధరించి కొత్త పెళ్లి కూతురుగా శంకరుని కోసం ఎదురు చూస్తుంది. దేవి గణాలు , దేవగణాలు, విష్ణు పరివారం, ఇంద్రాది దేవతలు శంకరుని కాల్యాణం కోసం కొత్త అలంకారాలతో నగ ధగ ధగలతో అలంకారం అవుతున్నారు.. శివుని దేహం మీద వుండే సర్పాలు సువర్ణ ఆ భరణాలు అయ్యాయి. చితాభస్మం సుంగధ భరితంగా మారింది. 

‌------------------------------------------------------------------------------------------------------------------

‌దిగుంబరుడు అయిన పరమేశ్వరుడు పట్టు వస్త్రాలతో ధగధగ కాంతులతో కళకళలాడిపోతున్నాడు. విష్ణువు, బ్రహ్మా, ఇతర దేవ తలతో, మరియు పిచాచ గణాలతో కైలాసం ఎప్పుడు లేని విధంగా కొత్త కళను సంతరించుకుంది. ఇక ఆ పరమేశ్వరుని కల్యాణము, అక్కడికి వచ్చిన బంధుగణము పిచాచాల అల్లరి, భేతాళ నృత్యాలు ఇలా ఒకటేమిటి... ఎక్కడా లేని హడావుడి.. ఎప్పుడు చూడని సందడి... ఆదిదేవుని కల్యాణ వైభవం ఎలా ఉందో చూతము రారండి.

‌శివర్వతుల కల్యాణం నిశ్యయమైంది. ముల్లోకాలన్నీ ఎంతో సంతోసంగా పమేశ్వరుని కల్యాణం కోసం ఎదురు చూస్తున్నాయి. శంకరుని మామగారు అయిన హిమమంతుడు ఆయన కుల గురువును పిలిచి బ్రామ్మాణోత్తమా మీరు నా కుమార్తె, గారాల పట్టి వివాహ లగ్న పత్రికను రాయండి.. అని పురమాయించాడు. అది పూర్తయిన తరువాత తన కుమారులను పిలిచి మీరు వెళ్లి మీ బావ గారు, మగ పెండ్లివారు అయిన శంకరునికి ఈ లగ్న పత్రికను ఇచ్చి రండి అని పంపించాడు. దానిని తీసుకుని పరమేశ్వరుని సన్నిధి చేరారు. పరమేశ్వరునికి చూపించారు. దానిని చూసిన శంకరుడు ఒకింత సిగ్గుతో లగ్న పత్రికను స్వీకరించాడు. తరువాత వచ్చిన వారికి అతిధి సత్కారం చేసి వారిని గౌరవంగా పంపించాడు.

‌ఆ లగ్న పత్రికను తనివితీరా చూసుకున్న పరమేశ్వరుడు దానిపై వున్న శివ పార్వతుల పేరులను చూసి ఎంతో ఆనందభరితుడు అయ్యాడు. కాసేపు అలా చూసిన తరువాత నారద మహార్షిని పిలిచాడు. మహార్షి మీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. అది ఏమిటంటే మీరు తక్షణమే వెళ్ళ వలసి వుంటుంది. ఈ లగ్న పత్రికను ముల్లోక వాసులందరికీ అందించండి. తమరు ఈ కార్యం చేసే సమయంలో వారితో ఇలా చెప్పండి. శంకరుని మాటగా నేను వచ్చానని ఇది శంకరుని ఆహ్వానం అని చెప్పండి. వారి తరుపున నేను వచ్చాను. అంతే.. మీరు అందరూ బంధుగణంతో సకుటుంబ సపరివార సమేతంగా శివపార్వతుల వివాహానికి రండి అని ఆహ్వానించండి. అని నారదునికి పరమేశ్వరుడు మరి మరీ చెప్పాడు. నారదుడు శంకరుని నమస్కరించి వెంటనే బయలుదేరాడు.

‌నారాయణా.. నారాయణా... నారాయణా... నారాయణా.. అనుకుంటూ వైకుంఠానికి చేరాడు. మొదటి ఆహ్వాన పత్రికను వైకుంఠవాసునికి ఇచ్చాడు. తరువాత బ్రహ్మా, ఆ తరువాత ఇంద్రాది దేవతలు, అనంతరం మిగిలిన ముల్లోక వాసులకు ఆహ్వాన పత్రికను అందించాడు. అందరిని పేరు పేరునా ఆహ్వానించి చివరికి కైలాసానికి చేరాడు. కైలాస పర్వతం పెళ్లి కళను సందరించుకుంది. కొత్త తోరణాలు, భేరీ నాధాలు, ఢమరుక శబ్దాలు ఒకటా రెండా ఎన్నో కొత్త సందడులు, ఆపుడే కైలాసానికి ఓం ప్రథమంగా విష్ణుమూర్తి వచ్చాడు. గరుడ వాహనదారుడై సపరివార సమేతంగా వైకుంఠ వాసులతో యెక్కడాలేని అట్టహాసంతో వచ్చాడు. ఆయన అడుగు పెట్టడంతోనే కొత్తకళ వచ్చేసింది. వచ్చీ రాగానే శివుడికి సతీసమేతంగా అభివాదం చేశాడు. అనంతరం ఆయనచే నిర్మించబడిన ఆసనాన్ని అధిష్టించి కూర్చున్నాడు అనంతుడు.

‌ఆ వెనుకే హంసవాహన దారుడై అజుడు సావిత్రీ, సరస్వతీ, గాయత్రీ సమేతంగా వేంచేశాడు. వారి తరువాత దేవేంద్రుడు వచ్చాడు. అంతలోనే మిగిలిన దేవతలు కూడా రివ్వు రివ్వున కైలాసం చేరారు..

‌ఈ విధంగా ముల్లోక వాసులతో కైలాసం కళకళలాడిపోతుంటే మరో వైపున ఈశ్వరుడిని పెండ్లి కుమారుడిగా చేయడానికి సప్త మాత్రికలు వచ్చారు. శివుడ్ని అలంకరించబోయారు. మహా దేవుని వివాహం అంటే అత్యంత సుందరంగా దీర్చిదిద్దాలి అనుకుంటున్నారు. వాళ్ల మనసులో ఎలా అలంకరించాలి అనుకుంటున్నారో అచ్చం అలాగే మారిపోమాడు ఆ శివుడు.

‌ఎలా మరాడు అంటే నుదుటున వున్న నిప్పుకన్ను నిలువు తిలకంగా మారింది. చెవులకు వ్రేలాడే సర్పాలు కర్ణకుండలాలుగా మారాయి. మిగిలిన సర్పాలు ఆయన అవయవాలకు సువార్ణ ఆభరణాలుగా మారిపోయాయి. శరీరం మీద వున్న చితాభస్మం సుగంధ భరితంగా మారిపోయింది. ఏనుగుతోలు పట్టు వ స్త్రాలుగా మారిపోయాయి. చివరికి శంకరుడు కొత్త పెండ్లి కొడుకు అయ్యాడు. ఆ రూపంతో బయటకు వచ్చాడు. ఆ సుందర రూపాన్ని చూసి అందరూ ఆశ్యర్యపోయారు. పరమేశ్వరుడేనా ఆనుకున్నారు. భక్తి ప్రవర్తులతో నమస్కరించారు. అప్పుడు విష్ణువు శివుని వద్దకు వెళ్లి శివా... నీ వివాహం పూర్తి వైదిక విధానంలో జరగాలని నా కోరిక. ఇప్పుడు నీ వివాహం ఎలా జరిగితే లోకంలో తక్కిన పెళ్లిళ్లు అలాగే జరుగుతాతాయి. అందువల్ల నందిముఖం స్థాలీపాకంలాంటి వైదిక కర్మలతో కూడుకున్నదిగా వివాహం ఉండాలి. అని ప్రార్ధించాడు. ఉత్తిపుణ్యానికే అడిగిన వరాల ఇచ్చే దయామయుడు శంకరుడు. ఆయన ఇప్పుడు పెండ్లికొడుకు కూడా. మరింత విరివిగా వరాలిస్తున్నాడు. ఎటూ అమ్మవారి కోసం లౌకిక వివాహ లీల ప్రదర్శించబోతున్న స్వామికి విష్ణువు కోరిక ఏపాటిది. శంకరుడు సరే అలాగే కానివ్వండి అని అన్నాడు. తక్షణమే బ్రహ్మా దేవుడు ముందుకు వచ్చాడు. అభ్యుదయ కర్మకాండ గావింపజేశాడు. ఎందరెందరో విప్రులు, అత్రి, అగస్త్యుడు, అరుణపాలుడు, ఉపమన్యుడు, కణ్వ, పిప్పలాదుడు, దదీచి, మార్కండేయుడు, వశిష్ట వేదవ్యాసుడు ఇలా ఒకరేమిటి బ్రహ్మ చెప్పిన పద్ధతిలో వివాహం కార్యక్రమం ఆరంభించారు. అనంతరం మగ పెండ్లివారు పెండ్లికి బయలుదేరరారు.

‌కొత్త పెళ్లి కొడుకు అయిన శంకరుని వెంట ఒకళ్లా ఇద్దరా.. క్షేత్ర పాలక భైరవులు, తమ సమస్త గణాలతోటి వచ్చారు. అటు విష్ణు పరివారం, ఇటు బ్రహ్మాపరివారం, సర్వాభరణాలతో ముప్పై నూడు కోట్ల మంది దేవతలు, ఆ దేవతలకన్నా అనేక రెట్లు అంటే సుమారు ఇరవై యెనిమిది లక్షల కోట్ల గణాలతో.. విశాఖ, శకువర్ణ కేకరాక్షాది గణాలు, విజయ, వినోద మంగళాట్టహాసాలతో తరలివచ్చారు. శాకినీశక్తులు, యాతుధానులు, బేతాళులు, బ్రహ్మారాక్షసులు, భూత, ప్రేత, పిచాచాలు, వాటి అల్లరికి అంతేలేదు. 

‌వాటికి వ్యతిరేకమయిన దోరణిలో శత మర్కట తుల్యుడైన బ్రమ్మచారి నారదుడి ఆధ్వర్యంలో తుంబుర, హాహా.. హూహూ యిత్యాది గంధర్వుల వీణామృడంగాది మంగళవాద్య ఘోషలు, అందంగా ఆలపిస్తున్నారు. వీళ్లు వాళ్లు అని చెప్పడం ఎలా సాధ్యం, దేవుని పెళ్లికి అందరూ పెద్దలే కదా.. వీరందరితో మహా సందడిగా మామగారు అయిన హిమమంతుడి ఇంటికి మరి కాసేపటిలో చేరుకోబోతున్నారు.

‌రెండవ భాగం ఉంది. గమనించగలరు.

‌, విష్ణు పరివారం, ఇంద్రాది దేవతలు శంకరుని కాల్యాణం కోసం కొత్త అలంకారాలతో నగ ధగ ధగలతో అలంకారం అవుతున్నారు.. శివుని దేహం మీద వుండే సర్పాలు సువర్ణ ఆ భరణాలు అయ్యాయి. చితాభస్మం సుంగధ భరితంగా మారింది. 

------------------------------------------------------------------------------------------------------------------

దిగుంబరుడు అయిన పరమేశ్వరుడు పట్టు వస్త్రాలతో ధగధగ కాంతులతో కళకళలాడిపోతున్నాడు. విష్ణువు, బ్రహ్మా, ఇతర దేవ తలతో, మరియు పిచాచ గణాలతో కైలాసం ఎప్పుడు లేని విధంగా కొత్త కళను సంతరించుకుంది. ఇక ఆ పరమేశ్వరుని కల్యాణము, అక్కడికి వచ్చిన బంధుగణము పిచాచాల అల్లరి, భేతాళ నృత్యాలు ఇలా ఒకటేమిటి... ఎక్కడా లేని హడావుడి.. ఎప్పుడు చూడని సందడి... ఆదిదేవుని కల్యాణ వైభవం ఎలా ఉందో చూతము రారండి.



------------------------------------------------------------------------------------------------------------------

శివపార్వతుల కల్యాణం నిశ్యయమైంది. ముల్లోకాలన్నీ ఎంతో సంతోసంగా పమేశ్వరుని కల్యాణం కోసం ఎదురు చూస్తున్నాయి. శంకరుని మామగారు అయిన హిమమంతుడు ఆయన కుల గురువును పిలిచి బ్రామ్మాణోత్తమా మీరు నా కుమార్తె, గారాల పట్టి వివాహ లగ్న పత్రికను రాయండి.. అని పురమాయించాడు. అది పూర్తయిన తరువాత తన కుమారులను పిలిచి మీరు వెళ్లి మీ బావ గారు, మగ పెండ్లివారు అయిన శంకరునికి ఈ లగ్న పత్రికను ఇచ్చి రండి అని పంపించాడు. దానిని తీసుకుని పరమేశ్వరుని సన్నిధి చేరారు. పరమేశ్వరునికి చూపించారు. దానిని చూసిన శంకరుడు ఒకింత సిగ్గుతో లగ్న పత్రికను స్వీకరించాడు. తరువాత వచ్చిన వారికి అతిధి సత్కారం చేసి వారిని గౌరవంగా పంపించాడు.

------------------------------------------------------------------------------------------------------------------

ఆ లగ్న పత్రికను తనివితీరా చూసుకున్న పరమేశ్వరుడు దానిపై వున్న శివ పార్వతుల పేరులను చూసి ఎంతో ఆనందభరితుడు అయ్యాడు. కాసేపు అలా చూసిన తరువాత నారద మహార్షిని పిలిచాడు. మహార్షి మీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. అది ఏమిటంటే మీరు తక్షణమే వెళ్ళ వలసి వుంటుంది. ఈ లగ్న పత్రికను ముల్లోక వాసులందరికీ అందించండి. తమరు ఈ కార్యం చేసే సమయంలో వారితో ఇలా చెప్పండి. శంకరుని మాటగా నేను వచ్చానని ఇది శంకరుని ఆహ్వానం అని చెప్పండి. వారి తరుపున నేను వచ్చాను. అంతే.. మీరు అందరూ బంధుగణంతో సకుటుంబ సపరివార సమేతంగా శివపార్వతుల వివాహానికి రండి అని ఆహ్వానించండి. అని నారదునికి పరమేశ్వరుడు మరి మరీ చెప్పాడు. నారదుడు శంకరుని నమస్కరించి వెంటనే బయలుదేరాడు.

------------------------------------------------------------------------------------------------------------------

నారాయణా.. నారాయణా... నారాయణా... నారాయణా.. అనుకుంటూ వైకుంఠానికి చేరాడు. మొదటి ఆహ్వాన పత్రికను వైకుంఠవాసునికి ఇచ్చాడు. తరువాత బ్రహ్మా, ఆ తరువాత ఇంద్రాది దేవతలు, అనంతరం మిగిలిన ముల్లోక వాసులకు ఆహ్వాన పత్రికను అందించాడు. అందరిని పేరు పేరునా ఆహ్వానించి చివరికి కైలాసానికి చేరాడు. కైలాస పర్వతం పెళ్లి కళను సందరించుకుంది. కొత్త తోరణాలు, భేరీ నాధాలు, ఢమరుక శబ్దాలు ఒకటా రెండా ఎన్నో కొత్త సందడులు, ఆపుడే కైలాసానికి ఓం ప్రథమంగా విష్ణుమూర్తి వచ్చాడు. గరుడ వాహనదారుడై సపరివార సమేతంగా వైకుంఠ వాసులతో యెక్కడాలేని అట్టహాసంతో వచ్చాడు. ఆయన అడుగు పెట్టడంతోనే కొత్తకళ వచ్చేసింది. వచ్చీ రాగానే శివుడికి సతీసమేతంగా అభివాదం చేశాడు. అనంతరం ఆయనచే నిర్మించబడిన ఆసనాన్ని అధిష్టించి కూర్చున్నాడు అనంతుడు.

------------------------------------------------------------------------------------------------------------------

ఆ వెనుకే హంసవాహన దారుడై అజుడు సావిత్రీ, సరస్వతీ, గాయత్రీ సమేతంగా వేంచేశాడు. వారి తరువాత దేవేంద్రుడు వచ్చాడు. అంతలోనే మిగిలిన దేవతలు కూడా రివ్వు రివ్వున కైలాసం చేరారు..

------------------------------------------------------------------------------------------------------------------

ఈ విధంగా ముల్లోక వాసులతో కైలాసం కళకళలాడిపోతుంటే మరో వైపున ఈశ్వరుడిని పెండ్లి కుమారుడిగా చేయడానికి సప్త మాత్రికలు వచ్చారు. శివుడ్ని అలంకరించబోయారు. మహా దేవుని వివాహం అంటే అత్యంత సుందరంగా దీర్చిదిద్దాలి అనుకుంటున్నారు. వాళ్ల మనసులో ఎలా అలంకరించాలి అనుకుంటున్నారో అచ్చం అలాగే మారిపోమాడు ఆ శివుడు.

------------------------------------------------------------------------------------------------------------------

ఎలా మరాడు అంటే నుదుటున వున్న నిప్పుకన్ను నిలువు తిలకంగా మారింది. చెవులకు వ్రేలాడే సర్పాలు కర్ణకుండలాలుగా మారాయి. మిగిలిన సర్పాలు ఆయన అవయవాలకు సువార్ణ ఆభరణాలుగా మారిపోయాయి. శరీరం మీద వున్న చితాభస్మం సుగంధ భరితంగా మారిపోయింది. ఏనుగుతోలు పట్టు వ స్త్రాలుగా మారిపోయాయి. చివరికి శంకరుడు కొత్త పెండ్లి కొడుకు అయ్యాడు. ఆ రూపంతో బయటకు వచ్చాడు. ఆ సుందర రూపాన్ని చూసి అందరూ ఆశ్యర్యపోయారు. పరమేశ్వరుడేనా ఆనుకున్నారు. భక్తి ప్రవర్తులతో నమస్కరించారు. అప్పుడు విష్ణువు శివుని వద్దకు వెళ్లి శివా... నీ వివాహం పూర్తి వైదిక విధానంలో జరగాలని నా కోరిక. ఇప్పుడు నీ వివాహం ఎలా జరిగితే లోకంలో తక్కిన పెళ్లిళ్లు అలాగే జరుగుతాతాయి. అందువల్ల నందిముఖం స్థాలీపాకంలాంటి వైదిక కర్మలతో కూడుకున్నదిగా వివాహం ఉండాలి. అని ప్రార్ధించాడు. ఉత్తిపుణ్యానికే అడిగిన వరాల ఇచ్చే దయామయుడు శంకరుడు. ఆయన ఇప్పుడు పెండ్లికొడుకు కూడా. 

------------------------------------------------------------------------------------------------------------------

మరింత విరివిగా వరాలిస్తున్నాడు. ఎటూ అమ్మవారి కోసం లౌకిక వివాహ లీల ప్రదర్శించబోతున్న స్వామికి విష్ణువు కోరిక ఏపాటిది. శంకరుడు సరే అలాగే కానివ్వండి అని అన్నాడు. తక్షణమే బ్రహ్మా దేవుడు ముందుకు వచ్చాడు. అభ్యుదయ కర్మకాండ గావింపజేశాడు. ఎందరెందరో విప్రులు, అత్రి, అగస్త్యుడు, అరుణపాలుడు, ఉపమన్యుడు, కణ్వ, పిప్పలాదుడు, దదీచి, మార్కండేయుడు, వశిష్ట వేదవ్యాసుడు ఇలా ఒకరేమిటి బ్రహ్మ చెప్పిన పద్ధతిలో వివాహం కార్యక్రమం ఆరంభించారు. అనంతరం మగ పెండ్లివారు పెండ్లికి బయలుదేరరారు.

------------------------------------------------------------------------------------------------------------------

కొత్త పెళ్లి కొడుకు అయిన శంకరుని వెంట ఒకళ్లా ఇద్దరా.. క్షేత్ర పాలక భైరవులు, తమ సమస్త గణాలతోటి వచ్చారు. అటు విష్ణు పరివారం, ఇటు బ్రహ్మాపరివారం, సర్వాభరణాలతో ముప్పై నూడు కోట్ల మంది దేవతలు, ఆ దేవతలకన్నా అనేక రెట్లు అంటే సుమారు ఇరవై యెనిమిది లక్షల కోట్ల గణాలతో.. విశాఖ, శకువర్ణ కేకరాక్షాది గణాలు, విజయ, వినోద మంగళాట్టహాసాలతో తరలివచ్చారు. శాకినీశక్తులు, యాతుధానులు, బేతాళులు, బ్రహ్మారాక్షసులు, భూత, ప్రేత, పిచాచాలు, వాటి అల్లరికి అంతేలేదు. 

------------------------------------------------------------------------------------------------------------------

వాటికి వ్యతిరేకమయిన దోరణిలో శత మర్కట తుల్యుడైన బ్రమ్మచారి నారదుడి ఆధ్వర్యంలో తుంబుర, హాహా.. హూహూ యిత్యాది గంధర్వుల వీణామృడంగాది మంగళవాద్య ఘోషలు, అందంగా ఆలపిస్తున్నారు. వీళ్లు వాళ్లు అని చెప్పడం ఎలా సాధ్యం, దేవుని పెళ్లికి అందరూ పెద్దలే కదా.. వీరందరితో మహా సందడిగా మామగారు అయిన హిమమంతుడి ఇంటికి మరి కాసేపటిలో చేరుకోబోతున్నారు.

రెండవ భాగం ఉంది. గమనించగలరు.

#varahi talks

1, నవంబర్ 2021, సోమవారం

శివుడి కోసం తన కన్నునే అర్పించిన విష్ణువు

శివుడి కోసం తన కన్నునే అర్పించిన విష్ణువు

శివపురాణం 31వ భాగం

అడిగిన వెంటనే వరాలు ఇచ్చే దయామయుడు ఆ పరమేశ్వరుడు.. భక్తుల కోరికలు తీర్చి, వారి సంతోషమే . తన సంతోషంగా భావించి ఆనంద తాండవం చేస్తాడు ఆ శంకరుడు చిన్న ఉదాహరణగా మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకుని నీవే దిక్కు అంటూ ప్రార్థిస్తే చటుక్కన వచ్చి ఆ యుముడినే దండించిన భక్తవశంకరుడు... అలాంటిది వైకుంఠవాసుడు ఆ శ్రీమన్నారాయణుడు అడిగితే కాదంటాడా...! లేదు. లేదు... తక్షణమే ప్రత్యక్షం అవుతాడుకదా.... మరి శ్రీమహావిష్ణువు ఎందుకు శివుడి గురించి తపస్సు చేయాల్సి వచ్చింది. శివుడు ప్రత్యక్షం అయ్యి ఏం వరం ఇచ్చాడు. అంతటి అవసరం ఏమొచ్చిందో తెలుసుకుందాం...

--------------------------------------------------------------------------------------



ఈ వీడియోని చూసే ముందు మీరు చేయాల్సిన చిన్న సహాయం ఈ వీడియోకి లైక్, చేసి మీ అభిప్రాయాన్ని తెలపగలరు. మీ అభిప్రాయం మరిన్ని వీడియోలు చేయడానికి మరింత సమాచారాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది.

--------------------------------------------------------------------------------------

దేవతలు చాలా భలవంతులు అలాంటి బలవంతులపై దానవులు అనేక సార్లు దాడులు చేశారు. చాలా సార్లు దేవతలు స్వర్గాన్ని వదిలి అడవులకు పారిపోయారు. మళ్లీ మళ్లీ.. దానవులు దాడులు చేస్తుండటంతో విసిగి పోయిన దేవతలు ఇక భరించలేక నారాయణ రక్త .....రక్ష... పద్మా క్ష..... రక్షించూ అంటూ వైకుంఠవాసుడి సన్నిధికి చేరారు. తమరే మమ్మల్ని రక్షించాలి.. ఆ దానవుల పెట్టే బాధలు భరించలేకున్నాము... వారి ఆగడాలు మితి మీరి పోతున్నాయి.... ! స్వర్గలోక వాసులు వారి నుంచి పారిపోతున్నారు. 

--------------------------------------------------------------------------------------

చాలా మంది మునులు మరణించారు. అగ్ని గుండాలను ధ్వంసం చేస్తున్నారు. ఒకటా రెండా ఏమని చెప్పము మా బాధలు తీర్చగలవారు అని మీ వద్దకు వచ్చాము.. అని విష్ణువుకు వారి వేధనను అంతా వివరించారు. అప్పుడు శ్రీ మహా విష్ణువు వారి బాధలు అన్ని ప్రశాంతంగా విని / దేవతలారా ఇది కాలమహిమే.. అందుకే వారు అలా చేస్తున్నారు. / మీరు బాధపడకండి. దీనికి ఒక్కటే మార్గం ఆ కంఠేకాలుణ్ణి ఆరాధించాలి.. కష్టం తీరే విధానాన్ని నేను కనుగొంటాను. మీరు ఇక ధైర్యంగా వెళ్లండి. అని పద్మాక్షుడు వారిని పంపించాడు..

--------------------------------------------------------------------------------------

అనంతరం విష్ణువు వైకుంఠం నుంచి బయలు దేరాడు. కంఠేకాలుణ్ణి ఆరాధించడానికి కైలాసం దగ్గరలో ఒక గుండాన్ని ఏర్పాటు చేశాడు. దానిలో అగ్నిని రగిల్చి వేద మంత్రయుక్తంగా హోమం చేయడం ప్రారంభించాడు. ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ... అంటూ నిత్యం పార్థివ లింగార్చన చేయడానికి సంకల్పించాడు. ఒక నాడు విష్ణువు మానస సరోవరానికి వెళ్లి వెయ్యి కమలాలు తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. శివ సహాస్రనామ స్తోత్రం చదువుతూ పువ్యులతో పూజ చేయడం ప్రారంభించాడు. ఒక్కో పువ్వు వేసి ఆ పరమేశ్వరుడి నామాన్ని జపిస్తున్నాడు... ఓం నమశ్చివాయా..అంటూ చివరి నామానికి వచ్చాడు. తొమ్మిది వందల తొంబై తొమ్మిది నామాలు పూర్తయ్యాయి. చివరిగా ఒక్క నామం మిగిలింది. పువ్వులేమో అయిపోయాయి.

--------------------------------------------------------------------------------------

 ఒక్క పువ్వు ఉంటే సహాస్ర నామాలు పూర్తవుతాయి. కాని విచిత్రం ఏమిటంటే తెచ్చింది వేయి పువ్వులు / కాని చివరికి ఒకటి తగ్గింది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు విష్ణువు.. అప్పుడు విష్ణువుకి ఒక ఆలోచన వచ్చింది. తనని పద్మాక్షుడు అని పిలుస్తారు.. అందువల్ల తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని అర్పించాలి అనుకున్నాడు. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన నేత్రాని పెకిలించి సహాస్ర నామాన్ని పూర్తి చేయాలి అని పూనుకుంటున్నాడు. అప్పుడు పెళపెళ రావాలతో మిలమిల మెరుపులతో దిక్కులు పిక్కటిల్లే విధంగా పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్ధం వెలుగులోంచి ఆదిదేవుడు.. ఆ పరమేశ్వరుడు, ప్రత్యక్షం అయ్యాడు. పద్మాక్ష... ఆగు.. ఆగు.. అంత పని చేయకు... నీ నేత్రం అగ్నికి ఆహుతి అయితే ఈ లోకం అంధకారం అవుతుంది.

--------------------------------------------------------------------------------------

ముల్లోకాలన్నీ నాశనం అవుతాయి. ప్రళయం సంభవిస్తుంది. అందుచేత తమరు ఈ కార్యాన్ని చేయకండి. తమరు చేసిన పూజకు నేను ఎంతగానో సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో పద్మాక్షా అని శంకరుడు ఎంతో ప్రసన్న వదనంతో విష్ణువుని అడిగాడు..

--------------------------------------------------------------------------------------

అప్పుడు విష్ణువు ఈ విధంగా అన్నాడు.. హే సర్వేశ్వరా... దైత్యదానవ వర్గాలు చెడు గుణాలను అందిపుచ్చుకుని ముల్లోక వాసులను కలవర పెడుతున్నారు. దానవుల బాధలు భరించలేక ఆదిత్యుడు అవస్థలు పడి అరణ్యాలకు వెళ్లిపోయాడు..! మునులను హింసిస్తున్నారు. దేవతలు భయంతో పారిపోతున్నారు. వీటన్నింటిని ఆపాలంటే నాకు మరింత శక్తి కావాలి ఇప్పుడు నాకున్న శక్తి వారిని ఎదురించడానికి సరిపోవడం లేదు. నాకు వున్న అస్త్రాలు చాలడం లేదు.. బ్రహ్మా దేవుడు దానవులకు అనేక వరాలు ఇచ్చాడు... ఆ వరాల ప్రభావంతో దానవులు మితి మీరిపోతున్నారు. వారిని శిక్షించాలి అంటే నాకు ఇంకా శక్తివంతమైన అస్త్రా లు కావాలి.. వానిటి ఇవ్వగలిగేది తమరు మాత్రమే.. అందువల్ల ఈ కార్యానికి పూనుకున్నాను అని ప్రార్ధించాడు.




--------------------------------------------------------------------------------------

తక్షణమే పరమేశ్వరుడు తన శక్తిని ఉపయోగించి ఒక చక్రాన్ని నిర్మించాడు అది ఎంతో మహిమలగది దానిని శ్రీహరికి అందించాడు.. అదే సుదర్శన చక్రం.. నాటి నుంచి విష్ణువు చక్రపాణి, చక్రధరుడు, చక్రి అనే పేర్లు వచ్చాయి. శివుడు ప్రసాదించిన సుదర్శన చక్రంతో దానవులను అంతం చేసి దేవతలకు సంతోషాన్ని ప్రసాదించాడు శివుడిని భక్తితో వేడుకుంటే ఒక్క సుదర్శన చక్రం ఏమిటి ఏదైనా ఇవ్వగలిగే ఆ పరమేశ్వరుడు ఏన్నో వరాలను శ్రీ హరికి ప్రసాదించాడు.

--------------------------------------------------------------------------------------

శ్రీ మహా విష్ణువు కాబట్టి వెంటనే ప్రత్యక్షం అయ్యాడు.. మరి సామాన్య జనులు అడిగితే ప్రత్యక్షం అవుతాడా.. అనే సందేహం రావచ్చు దానికి నిదర్శనంగా తరువాత వీడియోలో తప్పకుండా తెలుసుకుంటారు.

--------------------------------------------------------------------------------------

ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్లో ఓం నమశ్శివాయా అని 

ఆ పరమేశ్వరుడుని మనసారా ప్రార్ధించండి

#varahi talks


భారతదేశం దేవాలయాలకు పుట్టినిల్లు.. వింతలు, విశేషాలు, ఆశ్యర్యపరిచే ఆలయాలు అనేకం ఉన్నాయి. ఒక్కో ఆలయంలో  ఒక్కో విశిష్టత ఉంటుంది. అవన్నీ ఒకెత్తయితే, ఇప్పుడు మీరు చూడబోయేది మరో ఎత్తు.. 

---------------------------------------------------------------------------------------------------------------

ఏక రాయితో నిర్మించిన ఆలయం..  అత్యంత పురాత ఆలయం,  అద్భుత వాస్తు కలిగిన ఆలయం,  ఎన్నో సొరంగాలు, అంతు చిక్కని రహాస్యాలను తనలో దాచుకున్న గొప్ప ఆలయం.  అదే ఎల్లోరాలోని కైలాస ఆలయం..  చరిత్రకారులకి, శాస్త్రజ్ఞులకి          అంతుబట్టని ఆలయం.  యునెస్కో వారసత్వ సంపదలో చేరిన ఈ ఆలయం గురించిన విశేషాలేంటో చూద్దాం..




---------------------------------------------------------------------------------------------------------------

‘ఎలు’ రాజు కథ

సహ్యాద్రి పర్వతశ్రేణిలోని  చరణాద్రి కొండల్లో ఉన్న  ఎల్లోరాలోని 16వ గుహలోని  ఏకశిలా నిర్మాణమే కైలాస దేవాలయం.  అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు, ఎవరు, ఎలా నిర్మించారనే ఇప్పటికీ అంతుబట్టని రహాస్యం.  వందల సంవత్సరాల నాటిదని కొందరంటే, వేల సంవత్సరాల క్రితమే నిర్మించారని మరి కొందరు వాదిస్తారు.  ఇటీవల లభించిన కొన్ని ఆధారాల ప్రకారం  క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో కృష్ణ 1 అనే రాష్ట్రకూట చక్రవర్తి పునర్నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు.  అయితే కృష్ణ యాజ్ఞవల్కి రచించిన   కథా కల్పతరు’ అనే గ్రంధంలో చెప్పిన విధంగా  ఈ ప్రాంతాన్ని ’ఎలు’ అనే రాజు పాలించాడని,  ఓసారి అతడు తీవ్రమైన అస్వస్థతకి గురయ్యాడంటా..  భర్త కోలుకుంటే  శివుడికి గుడి కట్టిస్తాననీ  శిఖరాన్ని చూసేవరకూ ఉపవాసం చేస్తాననీ రాణి మొక్కుకుందట.  కోరుకున్నట్లే వ్యాధి తగ్గింది.  దాంతో నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలనుకున్నారట. కానీ శిఖర నిర్మాణానికి చాలా ఏళ్లు పడుతుందని నిపుణులు చెప్పారట. 

-----------------------------------------------------------------------------------------------------

పై నుంచి కిందకు చెక్కిన ఆలయం 

అప్పుడు పైథాన్‌ నగరం నుంచి కోకస అనే వాస్తుశిల్పి వచ్చాడు..  పర్వతం పైనుంచి కిందకి చెక్కుతూ కొద్ది రోజుల్లోనే శిఖరాన్ని  నిర్మించాడు.  దాంతో రాణి ఉపవాస దీక్షను విరమించిందనీ చెబుతారు. ఆపై ఆలయాన్ని దశలవారీగా కట్టినట్లు తెలుస్తోంది.  ఈ కథలో నిజానిజాల మాట ఎలా ఉన్నా  ఆలయాన్ని పై నుంచి కిందకి చెక్కుకుంటూ కట్టారనేది మాత్రం వాస్తవం.  ఈ దేవాలయం   కైలాస పర్వతాన్ని తలపించేలా ఉంటుంది.  అందుకే శైవభక్తులు  ఈ ప్రదేశాన్ని శివుడి నివాస స్థలంగా భావించి  ధ్యానం చేస్తుంటారు.  ’దారినిమ్ము ప్రభూ’ అంటూ  కొండల్నీ, సముద్రాల్నీ, భూమాతనీ పూజించే వైదిక సంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడ మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ తరువాత రాతిని తొలిచారనీ చెబుతారు.  ఈ ఆలయంలో వేదమంత్రాలను చదువుతుంటే అవి ప్రతిధ్వనించే తీరు మరెక్కడా వినిపించదనీ పండితులు చెబుతారు.

----------------------------------------------------------------------------------------------------

గుహాలయం!

ఎల్లోరాలోని 34 గుహాలయాల్లో దాదాపుగా మధ్యలో ఉంటుందీ ఈ ఆలయం.  అక్కడ ఉన్న గుహలన్నీ కూడా తొలిచినవే. కానీ ఎప్పుడు తొలిచారనేది ఎవ్వరికీ తెలియదు.  బహుశా 5 నుంచి 10వ శతాబ్దం మధ్యలో అయి ఉంటుందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు..

-----------------------------------------------------------------------------------------------------------------------

ఆలయ విశిష్టత 

కైలాస ఆలయానికి చుట్టూ ఉండే గోడ 276 అడుగుల పొడవు  154 అడుగుల వెడల్పూ  100 అడుగుల ఎత్తూ ఉంటుంది. హిందూ సంప్రదాయంలో భాగమైన ఏనుగులు  ఈ ఆలయంలోని లోపలి భాగంలో కూడా కనిపిస్తాయి.  ఆలయం మధ్యలోని గర్భగుడిలో శివుడు కొలువై ఉంటాడు.  మిగిలిన గుడుల కంటే భిన్నంగా ఈ ఆలయ శిఖరం చాలా చిన్నగా ఉంటుంది. మధ్యలో ఉన్న మంటపం నుంచి నంది వాహనం వరకూ  వంతెనలాంటి నిర్మాణం ఉంటుంది.  నందికి రెండువైపులా ధ్వజ స్తంభాలు 45 అడుగుల ఎత్తులో ఉంటాయి.  ఆలయ ప్రాంగణంలో గర్భగుడితో పాటు గంగా, యమునా, సరస్వతుల కోసం నిర్మించిన మందిరాలూ ఉన్నాయి.  రామాయణ, మహాభారత గాథలు,  శివపార్వతులు,  వరాహమూర్తి,  మహిషాసుర వధ,  వంటి కళాఖండాలు ఇక్కడి గోడల మీద కనిపిస్తాయి.  ఈ ఆలయంలో మరో ప్రత్యేకత  రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకిలిస్తున్నట్లుగా  చెక్కిన శిల్పం ఆకర్షిస్తోంది.  ఈ శిల్పం భారతీయ శిల్పకళలోనే అద్భుతమని చెబుతారు.  ఈ శిల్పం కారణంగానే కైలాస దేవాలయంగా పేరు వచ్చిందని చెబుతారు.

--------------------------------------------------------------------------------------------------------------

ఔరంగజేబునే భయపెట్టిన ఆలయం

మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చడానికి  మూడేళ్లపాటు వెయ్యిమందితో శతధా ప్రయత్నించాడు.  వాళ్లు ఆలయగోడలకి గాట్లు పెట్టడం తప్ప  గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయారట.  పైగా ఈ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలూ ఉన్నాయి.  నీటిని నిల్వచేయడం, మురుగునీటి వ్యవస్థ,  రహస్యమార్గాలు,  బాల్కనీలూ, మెట్లూ...  ఇలా ఎన్నో అద్భుతాలను రాయిని తొలిచి చెక్కడం గొప్ప విశేషం.

----------------------------------------------------------------------------------------------------------

ఎలా చెక్కారు

ఏ ఆలయాన్ని అయినా నేలమీద నుంచే కడతారు.  కానీ కొండ పైనుంచి కిందికి తొలుస్తూ కట్టిన ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే   ’యూ’ ఆకారంలో కనిపించే  ఈ ఆలయాన్ని ఎటునుంచి చెక్కుకొచ్చారనేది నేటికీ తేలలేదు.  ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న విఘ్నేశ్వర శిల్పాన్ని బట్టి అక్కడినుంచే మొదట ప్రారంభించారని అనుకోవాలి.

----------------------------------------------------------------------------------------------------------

18 సంవత్సరాల్లో కట్టిన ఆలయం

ప్రాచీన ఆలయాన్నింటిలోకీ పెద్దదైన  ఈ ఏకరాతి ఆలయ నిర్మాణం కోసం  4 లక్షల టన్నుల రాతిని తొలిచినట్లూ  18 సంవత్సరాల్లో కట్టినట్లూ తెలుస్తోంది.  కానీ 18 ఏళ్లలో విరామం లేకుండా తవ్వినా  లక్ష టన్నుల రాయిని తొలగించడం సాధ్యం కాదనీ  ఈ మొత్తం నిర్మాణాన్ని 7వేల మంది  రాత్రి, పగలూ కట్టినా కనీసం 150 సంవత్సరాలు పడుతుందనేది  కొందరు ఆర్కియాలజిస్టుల అంచనా.  ఎంత గొప్ప సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించినా 18 ఏళ్లలో కట్టడం అసాధ్యం అనీ అంటున్నారు.  పైగా చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత పెద్ద గుహని తొలిస్తే  కుప్పలు తెప్పలుగా వచ్చే రాళ్ల ముక్కలూ  లేదా పొడి ఆనవాళ్లూ ఎక్కడా లేవు.  అలాగని ఈ గుహ సహజంగా ఏర్పడినది కాదు. 



----------------------------------------------------------------------------------------------------------

భౌమాస్త్రం పరికరం

ఈ ఆలయ నిర్మాణంలో  భౌమాస్త్రం అనే ఓ శక్తిమంతమైన పరికరాన్ని ప్రయోగించి ఉంటారని భావిస్తున్నారు.  ఈ యంత్రం రాతిని తొలిచేటప్పుడే వచ్చిన ధూళిని వచ్చినట్లు  గాలిలో కలిపేస్తుంటుందనీ ఖగోళశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.  మొత్తంగా ఊహలే తప్ప ఎవరికీ దీని నిర్మాణ రహస్యం గురించి తెలియదు.  ఒకవేళ చక్రవర్తులే కట్టించారా అంటే  ఎక్కడా దానికి సంబంధించిన శాసనాలు కనిపించలేదు.  ఆ సర్వేశ్వరుడే తనకో ఆవాసం కావాలని ఈ ఆలయాన్ని నిర్మించి  ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడని శివభక్తులు బాగా నమ్ముతారు  ఎందుకంటే కొన్నిచోట్ల మనిషి దూరలేని సందులూ కూడా చాలా ఉన్నాయి. అలాగని రసాయనాల్ని వాడారా అంటే అందుకు ఆధారాలు లేవు. 

-----------------------------------------------------------------------------------------------------------

మరుగుజ్జులు కట్టిన ఆలయం

లిల్లీపుట్స్‌ లాంటి సూక్ష్మ మనుషులెవరైనా  దీనికి సాయం చేసి ఉండొచ్చని కొందరు అంటున్నారు.  ఈ ఊహలన్నీ పక్కనపెడితే క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి  క్రీ.శ. ఏడో శతాబ్దం మధ్యలో చేతి పనిముట్లతోనే ఈ ఆలయాన్ని నిర్మించారని  రోజుకి 18 గంటల చొప్పున పనిచేసి ఉంటారనేది మరో అంచనా.  ఈ ఆలయాన్ని తొలిచే సమయంలో  వెలుతురు కోసం సూర్యకాంతి పడేలా అద్దాలు ఏర్పాటు చేశారని  దానికి అనుసంధానంగా మరో అద్దం  ఇలా అనేక అద్దాలు ఏర్పాటు చేసి ఉండొచ్చని ఒక వాదన.  కానీ ఆలయం లోపలి భాగాల్లో ఎన్ని అద్దాలను అమర్చినా సూర్యకాంతి పడే అవకాశం లేదు.  మహామునులు జ్ఞాననేత్రంతో చూసి చెబుతుంటే, చీకటిలోనే శిల్పులు చెక్కి ఉండవచ్చు అని కొందరు చెబుతారు.  ఈ ఆలయాన్ని చెక్కిన శిల్పికి వేదల గురించి  విజ్ఞానం గురించి, వాస్తు గురించి ఎన్నో విషయాలు తెలిసుండాలి.  నిర్మాణంలో అద్భుతమైన ప్రతిభాపాటవాలు, వేలమంది శిల్పులతో పనిచేయించగల నేర్పరితనం అతనికి ఉండి ఉండాలి.

--------------------------------------------------------------------------------------------------

ఆలయంలో సారంగ రహాస్యాలు!

ఈ ఆలయంలో మరో విశేషం సొరంగాలు.  ఇవి నలభై అడుగుల లోతు వరకూ ఉంటాయని చెబుతారు.  కావాలియర్‌ లూయీ అనే వ్యక్తి ఈ సొరంగంలోకి వెళ్లాడనీ,  పెద్ద లోహరాతి వేదికలు బ్యాటరీల సాయంతో చార్జింగ్‌ అవుతున్నాయనీ,  వాటిమీద ఏడుగురు వ్యక్తులు కూర్చుని ఉన్నారనీ,  మధ్యలోని వ్యక్తి రూపం అస్పష్టంగా ఉందనీ  కానీ ఆయన మాట్లాడుతున్నాడనీ చెప్పే కథలు ప్రచారంలో ఉన్నాయి.  ఇక ఆలయంలోని శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు.  బహుశా సొరంగ నగరంలోకి వెళ్తాయని  ఊహిస్తున్నారు.  ఈ ఆలయ ప్రాంగణంలో నేలకు రంధ్రాలు ఉంటాయి.  గాలీ వెలుతురు కోసం ఏర్పాటు చేశారని ఊహిస్తున్నారు.  వాటిల్లో పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూసి వేయించింది.  అయితే అక్కడ విలువైన నిధులు    ఉండొచ్చు.  లేదంటే ఆలయం కింద అంత పెద్ద సొరంగాలు ఎందుకు తవ్వినట్లు... అనేవాళ్లు ఉన్నారు.  లేదా అవన్నీ ప్రాచీన నగరాలుగా భావిస్తున్నారు... గుండ్రంగా ఉన్న ఈ రంధ్రాల్లోకి మరు గుజ్జులు లాంటి మనుషులే పడతారు.  దీనికి నిర్శనంగా ఇక్కడి గోడలపై వారి రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది.  ఏది ఏమైనా ఎన్నో అంతుబట్టని రహస్యాలకు నిలయమైన ఎల్లోరాలోని కైలాస దేవాలయం చూసి తీరాల్సిన అద్భుతం!.  

#varahitalks

విష్ణు సహస్ర నామాలను రికార్డ్ చేసిన మొట్ట మొదటి టేపిరికార్డర్

విష్ణు సహస్ర నామాలను రికార్డ్ చేసిన మొట్ట మొదటి టేపిరికార్డర్ | who stored vishnu sahasra namas



అది 1940వ సంవత్సరం. ఒక వ్యక్తి మహా పెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు... శివ్యులను అగిడితే స్వామి ధ్యానంలో ఉన్నారు కూర్చొండి అన్నారు. అతని చేతిలో ఒక టేప్ రికార్డర్ ఉంది. అది చూసి అందరూ ఆశ్యర్యపోయారు. కొంత సేపటి తరువాత స్వామి బయటికి వచ్చారు. శిష్యులు అతని గురించి చెప్పి స్వామి వద్దకు పంపించారు.




స్వామి నమస్కారం.. మిమ్మల్ని ఇంజర్య్వూ చేయడానికి వచ్చాను.. టేపిరికార్డర్ పట్టుకుని అడిగాడు. / అలాగే అని కూర్చున్నారు మహాస్వామి../ ఇటర్య్వూ అనగానే అక్కడ ఉన్న వారందరూ వచ్చి చుట్టూ కూర్చున్నారు. ఆ వ్యక్తి మహా స్వామిని ఏదో అడగబోతుంటే / వెంటనే స్వామి ఇలా అన్నాడు.. / నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగాడు... / టేప్ రికార్డర్ స్వామి అన్నాడు.. / అవునా... ప్రపంచంలో అతి పురాతనమైన టేప్ రికార్డర్ ఏమిటో తెలుసా.. అన్నాడు.. / అతని నోటి వెంట మాట రాలేదు.. / వెంటనే మరో ప్రశ్న విష్ణు సహస్రనామం / మనకు ఎలా వచ్చింది అని అడిగారు. / అతనికి తెలియదు.. కాని శిష్యులలో ఒకతను టక్కున లేచి భీష్ముడు భోధించాడు స్వామి అన్నాడు.. / మరి భీష్ముడు భోధిస్తే ఎవరు వ్రాశారు అన్నారు మహాస్వామి.. / టక్కున కూర్చున్నాడు లేచినవాడు. అక్కడ వున్న అందరూ మహా స్వామి వైపు అమాయకంగా చూశారు. '


నాయనలారా... విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా గొప్పది... దాని గురించి పూర్తి వివరంగా చెబుతాను వినండి... అని మహా స్వామి చెప్పడం మొదలు పెట్టారు..


కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసిన తర్వాత / భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. / సుమారు నెలరోజులు తర్వాత / ఒకనాడు పాండవులతో మాట్లాడుతూ / శ్రీకృష్ణుడు హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు. / కాసేపు మౌనంగా నిల్చున్నాడు... / కంగారు పడిన పాండవులు కృష్ణా.. కృష్ణా... ఏమైంది అని కృష్ణుడిని అడిగారు.


అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ముడు / నన్ను స్మరించుకుంటున్నాడు... అందుకే నా మనస్సు అక్కడికి మళ్లింది. / పాండవులారా వెంటనే బయలుదేరండి / అక్కడకు వెళ్లాలి. అన్నాడు కృష్ణుడు.. / భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోసన పట్టినవాడు అని చెప్పి పాండవులను వెంటబెట్టుకుని / భీష్ముని వద్దకు పరుగున వెళ్లారు.


కృష్ణుడిని చూడగానే భీష్ముడు ఎంతో సంతోషించాడు.. / కృష్ణా వచ్చావా.. అంటూ / అంపశయ మీద నుంచే ఆప్యాయంగా పలకరించాడు. / నాయనా ధర్మరాజా.. నీకు విష్ణు సహస్రనామాన్ని భోధిస్తాను శ్రద్ధగా విను.. / ఈ స్తోత్రం ఎవరైతే పారాయణం చేస్తారో / వారి కోరికలు తీరి విజయం వరిస్తుంది నాయనా ! అంటూ విష్ణు సహస్ర నామాలను కృష్ణుడి వైపు చూసి భోధించడం ప్రారంభించాడు. సహస్రనామాలు అంటే వేయి నామాలు.. / ఒక్కొక్క నామం కీర్తిస్తూ ఉంటే కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అందరూ అత్యంత శ్రద్ధగా వింటున్నారు. చివరికి వేయి నామాలను పూర్తి చేసి తన బాధ్యతను పూర్తి చేశాడు భీష్ముడు.. / భీష్ముడు చెబుతుంటే అందరూ విన్నారేగాని ఎవరకూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడు "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము / కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా  కృష్ణా" అని అడిగాడు. / అవును కృష్ణా ఈ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు. / అప్పుడు శ్రీ కృష్ణుడు విష్ణు సహస్రనామాలను లికించాలంటే / సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది అన్నాడు.


“అదేలా” అని అందరూ ఆశ్యర్యంగా అడిగారు. / శ్రీ కృష్ణుడు ఇలా చెప్పాడు..! మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేక ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే / ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి మళ్లీ వినవచ్చు/ అప్పుడు వ్యాస మహర్షితో వ్రాయించవచ్చు / అని కృష్ణుడు సలహా ఇచ్చాడు. / శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు,/ ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోటు/ అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చున్నారు. / సహాదేవుడు స్పటికాన్ని పట్టుకుని శివుడిని ప్రార్థిస్తున్నాడు / అప్పుడు భీష్ముడు చెప్పిన మాటలు / మళ్లీ ఆ స్పటికం నుంచి వినిపిస్తున్నాయి. వాటిని శ్రద్ధగా విని వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు. / ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం అయింది. / అని శ్రీశ్రీశ్రీ మహా పెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అందరికీ వివరంగా చెప్పారు. వచ్చిన వ్యక్తి కూడా టేప్ రికార్డుల్లో స్వామి మాటలను రికార్డు చేసుకుని వెళ్లాడు.....



ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం, అటువంటి భారతదేశంలోని ఆలయ విశేషాలు, వింతలు, పురాణగాధలు, మహా వీరుల కథలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీ అందరి ఆదరణను పొందుతున్న వారాహి టాక్స్ చానల్ను ఇప్పుడే సబ్స్కబ్ చేయండి. ఎన్నో ఆధ్యాత్మీక విషయాలను తెలుసుకోండి.


 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...