దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి..
కనక దుర్గగా ఎలా మారింది
-------------------------------------------------------------------------
దేవి నవరాత్రుల సందర్భంగా మన చానల్ నుంచి దుర్గాదేవి మహిమలను అమ్మవారి విశిష్టతను వీడియలుగా అందించడం జరుగుతుంది. ఇది 3వ భాగం వీడియో...
-------------------------------------------------------------------------
ఈ వీడియోలో దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి.. కనక దుర్గగా ఎలా మారింది. ఆ అవతారం వెనుక వున్న కథ ఏమిటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి చాలు.
-------------------------------------------------------------------------
పూర్వం ఈ భూమండలాన్ని సురధుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ప్రజలను సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉండేవాడు. రాజ్య ప్రజలు సిరి సంపదలతో, ధన ధాన్య సమృద్ధితో నిత్యం కళకళలాతూ ఉండేవారు. ఇంతటి గొప్ప రాజ్యానికి ఆపద వచ్చింది. అందేంటంటే పొరుగు దేశ రాజులు సురధుడి రాజ్యం మీదకు యుద్ధాన్ని ప్రకటించాయి. ఒక రోజు యుద్ధానికి వచ్చిన వారితో సురధుడు పోరు సాగించాడు. అయినా వారి ముందు నిలవలేక ఓడిపోయాడు. రాజ్యమును కోల్పోయిన సురథుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ మేధసుని ఆశ్రమం ఉంటే ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. ఒక రోజు సురధుడిని మునీంద్రుడైన మేధస్సుడు చూసి సత్కారాలు చేశాడు. తన ఆశ్రమంలోనే అతనికి చోటు ఇచ్చా డు. కాని రాజుకు మాత్రం తన రాజ్యం ఎలా ఉందో.. ప్రజలు ఏం చేస్తున్నారో అనే దిగులుతో బాధపడుతున్నాడు.
-------------------------------------------------------------------------
ఒకరోజు ఆ ఆశ్రమ సమీపంలోనే ఏడుస్తూ "సమాధి" అనే పేరుగల వైశ్యునిడి చూచాడు రాజు. అతను చూస్తే గొప్ప ధనవంతులా కనిపించాడు. మరి అలాంటి వాడికి ఇంతటి కష్టం ఏమోచ్చి ంది. అనుకున్నాడు. వెంటనే అతని వద్దకు వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. దానికి వైశ్యుడు భార్యాపుత్రులు నేను లేకుండా ఎలా బతుకుతున్నారో.. ఏం చేస్తున్నారో అని తలుచుకుని బాధపడుతున్నాను అని చెప్పాడు. మరి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే ధన వ్యామోహంతో తనను భార్యాపుత్రులే విడిచిపెట్టారని ఆయనకు వివరించాడు.. అప్పుడు రాజు ఇలా అనుకున్నాడు.
-------------------------------------------------------------------------
తన సంతోషాన్ని కోల్పోయిన అతడు నిరంతరం తన భార్యాపుత్రుల గురించే ఆలోచిస్తూ ఉన్నాడే ఎంత మంచి మనస్సున్నవాడు అని అనుకున్నాడు. ఇక రాజు విషయానికి వస్తే.. సింహాసనం కోల్పోయాను అని.. రాజ్య ప్రజలు ఎన్ని బాధపలు పడుతున్నారో అని రాజు చింతిస్తున్నాడు. ఇలా ఒకరి బాధలు ఒకరు తెలుసుకుంటూ వారు మార్కండేయ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. మార్కండేయ మహర్షి వారి బాధలను విని దీనికి కారణం విషయ పరిజ్ఞానం లేకుండా పోవడం, అమిత ప్రేమ, మంచి చెడులు తెలుసుకోలేకపోవడం అని గ్రహించాడు.
-------------------------------------------------------------------------
అంతేకాదు మానవులు మాయా ప్రభావము చేత మమత అనే సుడిగుండములో పడి కొట్టుకుంటారని, దీని నుంచి బయట పడాలంటే దేవి అనుగ్రహం కావాలని అమ్మ అనుగ్రహం ఉంటే ఆ తరువాత ముక్తిని పొందవచ్చు అని వారికి చెప్పాడు.. మార్కండేయ మాటలు అన్ని జాగ్రత్తగా విన్నారు. మితి మీరిన అభిమానము, ప్రేమ అనురాగాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని సురథుడు, సమాధి అనుకున్నారు.
-------------------------------------------------------------------------
మహాముని వాక్యములను విని తపస్సు చేసుకోవడానికి కృష్ణానది ఉత్తర భాగాన వున్న అరణ్యాని కి వెళ్లారు. ఎలాగైనా పరమేశ్వరిని ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నారు. వైశ్యుడు, రాజు ఒక నది దగ్గర ఇసుక దిబ్బమీద కూర్చుని పరమేశ్వరీ గురించి తపస్సు చేయడం ప్రారంభించారు. స్వచ్ఛమౌన మట్టిని తీసుకుని దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారిరువురు పూలతో ధూ పముతో, అగ్ని, జలములతో దేవిని పూజిస్తున్నారు. తినకుండా, తాగకుండా ఏకాగ్రతతో బుద్ధి మనస్సులను దేవి యందు నిలిపి పరమేశ్వరిని వేడుకుంటున్నారు. శరీరానికి గాయాలు చేసుకు ని రక్త బిందువులతో బలులను సమర్పించిరి.
-------------------------------------------------------------------------
మూడు సంవత్సరములపాటు చండికను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. వారి తపస్సుకు మెచ్చి పరమేశ్వరీ ప్రత్యక్షం అయింది. ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది. రాజుమే వచ్చే జన్మలో శత్రు బాధలు లేని రాజ్యము కావాలి అని వరము కోరుకున్నాడు. వివేకం కలిగిన వైశ్యుడు జ్ఞానమును ప్రసాదించమని కోరుకున్నాడు. దేవీ కరుణా కటాక్షము వలన ఆ జన్మలోనే సురధునకు రాజ్యము ప్రాప్తించింది.. వైశ్య శేఖరునకు ఆత్మ సాక్షాత్కారము కలిగించు జ్ఞానము లభించింది.. భక్తులలు కోరిన కోరికలు ఆలస్యం కాకుండా వెంటనే ప్రసాదించే దేవి. పరమేశ్వరి 'దుర్గా నామముతో వెలసి వారి సేవలను పొందుతుంది..
-------------------------------------------------------------------------
ఆ తరువాత కొంత కాలానికి మాధవవర్మ రాజు ధర్మదీక్షకు పూనుకున్నాడు. సంతసించిన దుర్గ .. కనక వర్షము కురిపించి, లోకమును కరుణించింది. నాటినుండి పరమేశ్వరి "కనక దుర్గ' అని ప్రసిద్ధిగాంచింది. ఆమెయే విజయవాటికాధీశ్వరి కనక దుర్గ అమ్మవారు.
#VARAHI_TALKS

