10, ఆగస్టు 2022, బుధవారం

భక్తి తొమ్మిది రకాలు

 భక్తి తొమ్మిది రకాలు

శివపురాణానికి స్వాగతం. శివుని మహిమలను వివిధ భాగాలుగా వింటున్న మీ అందరికీ ఆ ప‌ర‌మేశ్వరుని క‌టాక్షాలు ల‌భించాల‌ని కోరుతూ.. ఈ వీడియోలో మహాదేవుడు స‌తీదేవికి బోధించిన తొమ్మిది ర‌కాల భ‌క్తి ప‌ద్ద‌తుల గురించి తెలుసుకుందాం.. ఈ వీడియోని చూసే ముందు కామెంట్‌లో ఓం న‌మ‌శివాయా అని రాసి విన‌గ‌ల‌రు. స‌తీదేవి శివుని వివాహం జ‌రిగిన త‌రువాత దాక్షాయ‌ణికి శివుడు ఇలా చెప్ప‌డం మొద‌లు పెట్టాడు. 

"ఓ సతీదేవి! భక్తికీ జ్ఞానానికీ అట్టే భేదం లేదు. కానీ భక్తే ఒక చూపు వాసిగా చెప్పుకోవలసి వస్తుంది. జ్ఞానంవల్ల ఐహికం అర్ధరహితమౌతుంది. భక్తులకు మాత్రం పరంతోబాటే ఐహికసుఖం కూడా అనుషంగికంగా అనుభవిస్తుంది. ఈ భక్తి తొమ్మిది రకాలుగా ఉంటుంది.

----------------------------------------------



మొద‌టిది శ్రవణం :- ఇతరుల ద్వారా నా గురించి వినడం. రెండ‌వ‌ది కీర్తనం : అంటే తనకు తానై నన్ను స్తుతించడం. ఇక మూడ‌వ‌ది స్మరణం :- ఎప్పుడూ నన్నే తలపులో వుంచుకోవడం, నామ జపం చేయడం. నాలుగ‌వ‌ది సేవనం :- రోజుకు ఐదు పర్యాయాలు వాక్కులతో స్తుతిస్తూ, చేతులారా నన్ను పూజించడం. అనంత‌రం ఐద‌వ‌ది దాస్యం:- అంటే నేను వినడం లేద‌ని తెలిసి కూడా నా సేవ తప్ప వేరు యెరుగక సర్వదా నాకు ప్రీతికరాలైన పనులు చేయడం. అనంత‌రం ఆర‌వ‌ది అర్చన:- తగిన సమయాలలో అర్ఘ్యపాద్యాది షోడశోపచారాలతో నన్ను పూజించడం. త‌రుప‌రి ఏడ‌వ‌ది వందనం:- నామంత్రోచ్చారణతో నా ధ్యానంతో మనో వాక్కాయశుద్ధిగా వక్షం, శిరసు, నేత్రాలు, మనస్సు, వాక్కు, పాదములు, హస్తములు, కర్ణములు భూమికి తాకే విధంగా నాకు ఆచరించే నమస్కారమే వందనం. ఇక ఏనిమిద‌వ‌ది. సఖ్యం:- ఏది జరిగినా అది తన మేలుకోసమే అని త‌ల‌చి నాచే జరిపించబడినట్లు భావించడం సఖ్యం. చివ‌రిగా మిగిలింది తొమ్మ‌ద‌వ‌ది ఆత్మార్పణం:- త‌న‌ శరీరంగాని, మరొకటి గాని తమవనే భావన ఉంచుకోకుండా, దేహ పోషణకై దేవుళ్ళాడి పోకుండా, భారం నామీద పెట్టి  నాచేత‌ యీయబడిన బ్రతుకు కొనసాగించడమే ఆత్మార్పణం.


ఈ తొమ్మిది రకాల భక్తిలో దేనిననుసరించినా నాకు ఆనందమే. దాక్షాయ‌ణీ మ‌రోక విష‌యం బిల్వ సమీకరణాది ఉపాంగాలు కూడా కొన్ని వున్నాయనుకో కానీ ఏదిఏమైనా *భక్తి ప్రధానం* భక్తి రహితమైన జ్ఞానం ఎందుకూ కొరగాకుండా పోతుంది. భక్తి - ఎటువంటి వారికైనా మోక్షార్హతని అనుగ్రహిస్తుంది. మూడు లోకాలూ, నాలుగు కాలాలా కూడా భక్తియే ఉత్తమమార్గం, మరీ ముఖ్యంగా కలియుగంలో భక్తికీ పున్న ప్రాధాన్యత మరి దేవికి పుండదు. ఆ యుగంలో జ్ఞానవైరాగ్యాలు ముసలితనం పొందుతాయి. అందువల్ల అవి యెక్కువగా వుపయోగపడకపోవచ్చు.

భక్తులు విన్నా నాకేమీ లేదు. భక్తులే నా సంపద, నాస్థితి ,నాగతి, భక్తుడి కోసం యమధర్మరాజునే కాల్చివేశాను నేను. ఇంతెందుకు దాక్షాయణీ!.. సతీపతి నన్నది భక్తులు పిలిచే పిలుపేగాని నిజానికి నేను భక్తులకు భక్తుణ్ణి అని శివుడు చెప్పినది విని సతీదేవి శివునియందు భక్తిని ఇంకా పెంచుకుంది. అనంతరం మంత్రం, తంత్రం, యంత్రం జ్యోతిష, సాముద్రికాది శాస్త్రాలను కూడా శివుని బోధించాడు. ప్రశ్నించి శివునివల్ల అనుగ్రహింపబడినది. లోకోపకారార్ధం వారలా తర్కించు కుంటారేగాని ఆ సతీ శివులు విడదీయరాని వారు. కొన‌సాగింపు వీడియోతో క‌లుసుకుందాం ఓం న‌మ‌శివాయా..



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...