కురుక్షేత్ర యుద్ధంలో వంట చేసింది ఎవరో తెలుసా..
యుద్ధం జరిగే సమయంలో సైనికులు పోరాడాలి. పోరాడాలి అంటే శక్తి కావాలి. అందుకు ఆహారం తీసుకోవాలి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో సేనలకు ఆహారం అందించింది ఎవరు..?. అసలు ఉడిపి రాజు ఏం చేశాడు... అతడు ఎందుకు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి పక్షాన పోరాడలేదు. క్రష్ణుడిని వద్దకు వెళ్లి ఏమని అడిగాడు. ఉడిపి రాజు కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఏం చేశాడో చివరి వరకు చూడండి.
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం పాండవులు మరియు కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం భీకరంగా జరిగింది. ఒకవైపు పాండవులు మరో వైపు కౌరవులు, రెండు సేవను యుద్ధానికి సిద్ధంగా వున్నాయి. ఇతర రాజులు కొంత మంది పాండవుల పక్షాన, కొంత మంది కౌరవుల పక్షాన నిల్చుని పోరాటానికి సిద్ధంగా వున్నారు. ఈ యుద్ధంలో వందలాది రాజులు పాల్గొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన పక్షాన వారు నిలబడి కౌరవులకో, లేదా పాండవులకో మద్ధతు ఇస్తున్నారు. కానీ ఒక రాజు మాత్రం ఎవరి పక్షాన నిలబడకుండా తటస్థంగా వున్నాడు. అతడే ఉడిపి రాజు. అతనికి ఎవరి పక్షాన నిలబడి యుద్ధం చేయడం ఇష్టం లేదు.
-------------------------------------------------------------------------------------------------
అందుకే శ్రీక్రుష్ణుని వద్దకు వెళ్లి స్వామి నేను ఎవరి పక్షాన యుద్ధంలో పాల్గొననను. కానీ రెండు సేనలకు మాత్రం ఆహారం అందిస్తాను. అని అడిగాడు. దీనికి శ్రీక్రిష్ణుడు సరే ఉడిపి రాజా రెండు సేనలకు ఎలాగూ ఆహారం అవసరమే కదా.. వారికి వంట చేసి వడ్డించండి. అని చెప్పాడు. యుద్ధానికి రెండు సేనలు కలిపి 5 లక్షల మంది సైనికులు వచ్చారు. అని ఆ రాజుకు చెప్పాడు. యుద్ధం 18 రోజుల పాటు కొనసాగింది. ప్రతీరోజు వేలాది మంది సైనికులు చనిపోతున్నారు. కాబట్టి ఆహారం తక్కువ చేసి వండాలి. అతను 5లక్షల మందికీ వంట చేయకూడదు. అలా చేస్తే ఆహారం వ్రధా అవుతుంది. అలాగని ఎక్కువ వండితే అది పాడైపోతుంది. ఉడిపి రాజు ఒక్క మెతుకును కూడా వ్రధా చేయకుండా చాలా చక్కగా ఎంతో జాగ్రత్తగా నిర్వహించేవాడు.
-------------------------------------------------------------------------------------------------
ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు వేల మంది చనిపోతున్నా ఆహారం మాత్రం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపోతుంది. రోజూ యుద్ధం ఎంతో మంది చనిపోయినా సరే మిగిలి వున్న వారికి çసరిగ్గా ఆహారం సరిపోతుంది. కొన్ని రోజుల తరువాత సైనికులకు మరియు ఇతర రాజులకు ఆశ్యర్యం వేసింది. అతను సరిపడా ఆహారం ఎలా వండగలుగుతున్నాడు అని.. యుద్ధంలో ఎంత మంది చనిపోతున్నారో ఎవరికీ తెలియదు. ఉదయం లేచి మళ్లీ యుద్ధం చేయాలి. కాబట్టి ఎంత మంది ఉన్నారు. ఎంత మంది మరణించారు. అనే విషయాలు మీకు ఎలా తెలుసున్నాయి. వారికే సరిపడా ఆహారం ఎలా వండగలుగుతున్నారు. అని చాలా మంది ఉడిపి రాజును అడిగారు.
-------------------------------------------------------------------------------------------------
దీనికి సమాధానంగా ఉడిపి రాజు ఇలా అన్నాడు. ప్రతిరోజు రాత్రి నేను క్రుష్ణుడి గుడారానికి వెళ్తాను. శ్రీ క్రష్ణుడు రాత్రిపూజ వేరుశనగలు తినడానికి ఇష్టపడడు. కాబట్టి నేను వాటిని ఒలిచి ఒక గిన్నెలో ఉంచుతాను. అతను కొన్ని వేరు శనగలను తింటాను. మరియు వాటిని తిన్న తరువాత ఎన్ని తిన్నాడో నేను లెక్కబెడతాను. క్రష్ణుడు 10 వేరుశనగలు తింటే రేపు యుద్ధంలో 10 వేల మంది చనిపోతారని తెలుసుకున్నాను. కాబట్టి ఎంత మంది జీవించి ఉండారో అంచనా వేసి వారికి మాత్రమే భోజనాలు సిద్ధం చేస్తాను. అది సరిగ్గా అందరికి సరిపోతుంది. అని వారికి చెప్పాడు.
-------------------------------------------------------------------------------------------------
అందుకే ఇప్పటీ చాలా మంది ఉడిపి ప్రజలు ఆహారాన్ని అందించేవారుగా జీవిస్తున్నారు
#varahitalks

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి