భారతదేశంలో ఎన్నో వింత ఆలయాలు ఉన్నాయి. మరెన్నో గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఎంతో మహిమ కలిగిన ఆలయం. మన తెలుగు రాష్ట్రంలోనే ఒక గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుంది. అందరికీ తెలియకపోవచ్చు కాని చాలా మంది నరక బాధలు తప్పుతాయని వెతుక్కుంటూ ఈ ఆలయానికి వెళతారు. ఇక్కడ నది ఉంది. అందులో మునిగితే చేసిన పాపాలు తొలగిపోతాయి. నరక బాధలు ఉండవని చెబుతారు. యమధర్మరాజు శాంతిస్తాడు. నరకం నుంచి దారి మళ్లిస్తాడు. స్వర్గానికి పంపిస్తాడు. ఇలా ఎన్నో విషయాలు భక్తులు చెబుతుంటారు. ఎందుకంటే ఇక్కడ యమధర్మరాజు గుడి ఉంది. అందుకే ఇంత ప్రత్యేకం ఈ ఆలయం.
ఆ క్షేత్రం ఏమిటి.... ఎక్కడ ఉంది.... ఆ ఆలయానికి అంత విశిష్టత రావడానికి కారణం ఏమిటి.... ఆ ఆ నది గురించి కథ ఏమిటి.. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం...
వివరళ్లు తొక్కుతూ ప్రవహించే గోదావరి నది. ఆ నది ఒడ్డునే శ్రీలక్ష్మీ నరసింహ స్వామి గుడి. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా పూలజందుకుంటుంది. ఈ ఆలయానికి అనేక పేర్లు ఉన్నాయి. దక్షిణ కాశీ, తీర్థరాజం, హరిహర క్షేత్రం వంటి పేరులతో విరాజిల్లుతుంది. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. త్రిమూర్తులు వెలసిన క్షేత్త్రం.. వనవాస సమయంలో శ్రీ రాముడే ఈ క్షేత్రాన్ని దర్శించి శివలింగాన్ని ప్రతిష్టించాడు.
---------------------------------------------------------------------------------------------------------------------
ఇక్కడ పూజలందుకునేది రామలింగేశ్వరుడు. లింగరూపుడు. ఈ క్షేత్రంలో నారసింహుడు కోరమీసంతో రెండు రూపాల్లో దర్శనమిస్తాడు. ఒకటి ఉగ్రరూపం అయితే రెండవది ప్రశాంత వదనం..
---------------------------------------------------------------------------------------------------------------------
పిండధానాలకు ప్రసిద్ధి :
దక్షిణ కాశీగా పేరు వున్న ఈ ఆలయం కర్మలకు కూడా ప్రసిద్ధి. ప్రక్కనే ఉన్న గోదావరి నది వద్ద పితృదేవతలకు పిండ ప్రధానాలు చేస్తారు. కాశీకి వెళ్లలేని వారు మన తెలుగు రాష్ట్రంలోని ఈ క్షేత్రానికి వెళతారు. క్రీస్తుపూర్వం 850-928కి ముందే ఈ ఆలయం ఉందని పరిశోధనకులు చెబుతున్నారు. మహిమగల ఈ క్షేత్రం కరీంనగర్ జి ల్లాలోని ధర్మపురి పట్టణంలో భక్తులకు దర్శనం ఇస్తోంది.
---------------------------------------------------------------------------------------------------------------------
మొగలులు ఆక్రమించిన ఆలయం
మొగలుల దండయాత్రలో భారతదేశంలో ఎన్నో ఆలయాలు ధ్వసం అయిన సంగతి మనందరికీ తెలుసు. అందులో ఈ ఆలయం కూడా ఉంది. నరసింహ స్వామి దేవాలయాన్ని అప్పటి హైదరాబాద్ సుల్తాన్ అయిన సుబేదార్ రుస్తుండీల్ ఖాన్ ఔరంగజేబు మద్దతుతో ఆలయాన్ని మసీదుగా మార్చాడు. తరువాత అంటే 1448లో మళ్లీ ఆలయంగా నిర్మించబడింది. నిత్యం పూజందుకుంది. ఇది ఆ నరసింహస్వామి మహిమేనని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
---------------------------------------------------------------------------------------------------------------------
స్థలపురాణం:
ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీ.శ.1422-33 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తోంది.
---------------------------------------------------------------------------------------------------------------------
నది మహాత్యం :
పూర్వం సత్యవతి, మేరునిధి అనే దండతులు ఉండేవారు. ఓ ముని ఇచ్చిన శాపం కారణంతో మేరునిధి పాము రూపం పొందాడు. దిగులు చెందిన అతని భార్య ఎన్నో గుళ్లూగోపురాలూ తిరిగింది. అయినా ఫలితం కనిపించలేదు. చివరికి ధర్మపురికి వచ్చి నృసింహస్వామిని దర్శించుకుందట. గోదావరిలో స్నానం ఆచరించగానే సత్యవతీదేవి భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం తెలుపుతోంది. అందువల్లే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదన్న నానుడి వచ్చిందని స్థానికుల విశ్వాసం.
వేదాలకు, సంస్కృతికి ప్రసిద్ధి ఈ ఆలయం :
చారిత్రకంగానూ ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. ధర్మపురి పట్టణం వేదాలకూ, ప్రాచీన సంస్కృతికీ, సంగీత సాహిత్యాలకూ పుట్టినిల్లుగా పేరుగాంచింది. ఇక్కడ బ్రహ్మపుష్కరిణితోపాటు సత్యవతీ ఆలయం (ఇసుక స్తంభం) ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శిస్తే మానసిక, శారీరక బాధల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం. నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం.
---------------------------------------------------------------------------------------------------------------------
ఆలయంలో దేవుళ్లు :
ఈ ఆలయంలో అనేక మంది దేవుని విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఎనిమిది హనుమంతుడి విగ్రహాలు మరియు ఆరు అడుగుల ఎత్తున్న బ్రహ్మ విగ్రహం. యమ, కృష్ణుడు విగ్రహాలు కూడా చూడదగినవి. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి యోగా ముద్రలో ఉంటాడు. అరచేతులను మోకాళ్లపై ఉంచి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు... ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా పక్కనే ఉంటుంది. ఇలాంటి యోగ ముద్ర రూపం అరుదుగా కనిపిస్తోందని చెబుతారు. స్వామివారి విగ్రహం మొత్తం సాలగ్రామ శిలతోనే తయారైంది. విగ్రహం చుట్టూ దశావతారాలు సుందరంగా కనిపిస్తుంటాయి. ప్రశాంత చిత్తంతో స్వామివారిని తలచినంతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
---------------------------------------------------------------------------------------------------------------------
యమధర్మరాజు గుడి :
దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు గుడి ఉంది. ఈ కారణంగానే 'ధర్మపురికి వస్తే యమపురి ఉండదనే నానుడి ప్రసిద్ధి చెందింది. ఒకసారి స్వామివారిని దర్శించుకోవాలని యమధర్మరాజు వచ్చాడంట... స్వామివారు అప్పుడు గోదావరి నదిలో స్నానం చేసి రమ్మని చెప్పారు. అలాగే చేశాడు యమధర్మరాజు రావడం అయితే వచ్చాడు కానీ స్వామివారు యమధర్మరాజుని పంపించలేదట. అక్కడే ఉండమని చెప్పారట. నా భక్తులు వస్తారు. వారికి సరక భాధలు తప్పించు... స్వర్గానికి దారి చూపించు అని అన్నాడట.. అందుకే ఇక్కడ యమధర్మరాజు కొలువై స్వామివారి భక్తులను గుర్తు పెట్టుకుంటాడు.
---------------------------------------------------------------------------------------------------------------------
బ్రహ్మాత్సవాలు :
ఈ ఆలయంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు.
ఎక్కడా లేని విధంగా త్రిమూర్తులు మరియు యమధర్మరాజు కొలువైన ఆలయం ఇది ఒక్కటి కావడం విశేషం.. మరో ప్రాచీన ఆలయం గురించి తెలుసుకుందాం... ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తరువాత విడియో కూడా చూడాలి అనుకుంటే సబైబ్ చేయండి.
#varahitalks







